ETV Bharat / business

జర జాగ్రత్త: సరికొత్త రూటులో సైబర్​ నేరాలు

author img

By

Published : Jun 25, 2020, 11:17 AM IST

ఓ వైపు దేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంటే.. ఇదే అదునుగా చేసుకొని సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో ఇంటర్నెట్​ వినియోగం, డిజిటల్​ లావాదేవీలు పెరిగాయి. దీంతో సై బర్​ మోసాలు అదే స్థాయిలో జరుగుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Cyberattacks increase after the pandemic, cases soar in Chennai and Bengaluru: Experts
దేశంలో పెరిగిపోతున్న సైబర్​ దాడులు.. తొలి స్థానంలో చెన్నై

కరోనా కారణంగా పెరిగిన డిజిటల్​ లావాదేవీల వల్ల ఇటీవలి కాలంలో దేశంలో సైబర్​ దాడులు విపరీతంగా పెరిగిపోయాయని నిపుణులు అంటున్నారు. అయితే మహమ్మారి తర్వాత ఈ పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని సైబర్​ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఐటీ పరిశ్రమకు తీవ్ర ఆందోళన కలిగించే రీతిలో ఇటీవలి కాలంలో సైబర్​ మోసాలు జరుగుతున్నాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. దక్షిణాది నగరాలైన చెన్నై, బెంగళూరులు సైబర్​ దాడిలో ముందువరుసలో ఉన్నట్లు తేలింది.

ఈ విషయమై దిల్లీకి చెందిన సైబర్​ నిపుణుడు ముకేశ్​ చౌదరి స్పందించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సైబర్​ నేరగాళ్లు.. మోసగించే పద్ధతులను కూడా మార్చుకున్నారని తెలిపారు.

'లాక్​డౌన్​ సమయంలో ఇంటర్నెట్​ వాడకం పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని మరిన్ని మోసాలకు పాల్పడుతున్నారు సైబర్​ కేటుగాళ్లు. మద్యం అమ్మకం, కొవిడ్​ కేర్​ వంటి పేర్లతో నకిలీ మొబైల్​ అప్లికేషన్స్ సృష్టించి వీటి​ ద్వారా సైబర్​ నేరాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఐటీ హబ్​లుగా పేరొందిన చెన్నై, బెంగళూరు నగరాల్లో సైబర్​ మోసాలు అధికమవుతున్నాయి. కాబట్టి వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.'

- ముకేశ్​ చౌదరి, సైబర్​ నిపుణులు, దిల్లీ

టాప్​-3లో ఇవే..

ఓ ప్రైవేట్​ సైబర్​ సెక్యూరిటీ సంస్థ- కే7 విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అధిక సైబర్​ మోసాలు జరుగుతున్న నగరాలలో చెన్నై(42%) తొలిస్థానంలో ఉంది. బెంగళూరు, పట్నాలు (38%) రెండోస్థానంలో ఉండగా.. హైదరాబాద్​, కోల్​కతాలు (35%) ఆ తరువాతి స్థానంలో ఉన్నాయి.

'విండోస్'​ లక్ష్యంగా..

సైబర్​ నేరగాళ్లు ఎక్కువగా మైక్రోసాఫ్ట్​కు చెందిన విండోస్​-ఎక్స్​పీ, విండోస్​-7 ఆపరేటింగ్​ సిస్టమ్​లనే లక్ష్యంగా చేసుకున్నారని కే7 సీఈఓ కేశవర్ధన్​ తెలిపారు. ఫలితంగా, మైక్రోసాఫ్ట్​.. ఈ రెండూ సాఫ్ట్​వేర్​లను అప్డేట్​, మెరుగుపరచడం నిలిపివేసిందని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'బాయ్‌కాట్‌ చైనా' వల్ల ఎవరికి లాభం?.. ఎవరికి నష్టం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.