ETV Bharat / business

కోలుకున్న మార్కెట్లు- 150 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్

author img

By

Published : Mar 4, 2020, 2:08 PM IST

Updated : Mar 4, 2020, 3:17 PM IST

stocks marksts
స్టాక్ మార్కెట్లకు కరోనా భయాలు

15:11 March 04

కాస్త వెనక్కి..

సెషన్​ ముగింపునకు ముందు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కాస్త కోలుకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 154 పాయింట్లకు పైగా నష్టంతో 38,469 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్లకు పైగా క్షీణతతో 11,265 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది.

13:47 March 04

కరోనా భయాలు స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. మిడ్​ సెషన్ తర్వాత బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టంతో 38,010 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా క్షీణతతో 11,100 వద్ద కొనసాగుతోంది.

క్రమంగా దేశంలో కరోనాా బాధితుల సంఖ్య పెరుగుతుండటం కారణంగా మదుపరులు అప్రమత్తత పాటిస్తున్నారు. 

30 షేర్ల ఇండెక్స్​లో సన్​ఫార్మా, ఏషియన్​ పెయింట్స్, టీసీఎస్​, ఇన్ఫోసిస్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.

టాటా స్టీల్, ఇండస్ఇండ్​ బ్యాంక్​, ఎస్​బీఐ, బజాజ్​ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated :Mar 4, 2020, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.