ETV Bharat / business

మార్కెట్లోకి సరికొత్త బజాజ్​ పల్సర్ 250

author img

By

Published : Oct 28, 2021, 1:57 PM IST

బజాజ్ సంస్థకు చెందిన మరో బైక్​ మార్కెట్​లోకి విడుదలైంది. దీపావళికి ముందే పల్సర్​ 250 సీసీ బైక్​ను గురువారం ఆవిష్కరించింది బజాజ్​.

Bajaj Pulsar 250
బజాజ్​ పల్సర్ 250

పల్సర్ బైక్​లకు మార్కెట్లో ఉన్న క్రేజ్​​ను రెట్టింపు చేసేందుకు సరికొత్త మోడల్​ను విపణిలోకి విడుదల చేసింది బజాజ్​. బైక్​ ప్రియులకు దీపావళి కానుకగా.. హై ఎండ్​ వెర్షన్​ బజాజ్​ పల్సర్​ 250 సీసీ ఇంజిన్​ లాంచ్​ చేసింది. మార్కెట్లోకి తొలి పల్సర్ మోడల్​ విడుదలై 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కంపెనీ ఈ కొత్త మోడల్​ను తీసుకొచ్చింది. సరికొత్త పల్సర్​ బైక్​ను రెండు వేరియంట్లలో(ఎన్​ఎస్​ 250 ఆర్​ఎస్​, 250ఎఫ్​) అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా.. రూ.1.38 లక్షలు, రూ.1.40 లక్షలుగా(ఎక్స్​-షోరూమ్) నిర్ణయించింది.​

Bajaj Pulsar 250
బజాజ్​ పల్సర్ 250

భారీ మార్పులు.. కొత్త ఫీచర్లు..

250 సీసీ మోడల్​లో బజాజ్​ సమూల మార్పులు చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా గత మోడళ్లతో పోలిస్తే.. డిజైన్​, సీటింగ్​ హైట్​, హెడ్​లైట్​ వంటివి పూర్తి భిన్నంగా ఉన్నాయి. టైర్లు మాత్రం.. పల్సర్​ ఎన్​ఎస్​, ఆర్​ఎస్​ మోడళ్లను పోలి ఉన్నాయి.

పల్సర్​ 250 సీసీ బైక్​ రెండు వేరియంట్లలో ట్విన్​ డిస్క్​ బ్రేక్​, టెలిస్కోప్​ ఫ్రంట్​ ఫోర్క్​, రియర్​ మోనోషాక్​, డిజిటల్​ ఇన్​స్ట్రూమెంట్​ క్లస్టర్​తో ఆధునీకరించారు. వీటితో పాటు.. స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీ, డ్యుయల్​ ఛానెల్​ ఏబీఎస్​, రైడ్​ మోడ్స్​ వంటి అధునాతన ఫీచర్లను పొందుపరిచారు.

ఇదీ చూడండి: Bajaj Dominar 400: బజాజ్​ నుంచి సూపర్ బైక్​.. ఫీచర్స్​ ఇలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.