ETV Bharat / business

వ్యాక్సిన్ సరఫరాలో ప్రభుత్వానికి సహకరిస్తాం: శోభనా కామినేని

author img

By

Published : Oct 15, 2020, 10:03 PM IST

త్వరలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్టు అపోలో గ్రూప్ ఆఫ్​ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్​పర్సన్​ శోభనా కామినేని అన్నారు. ప్రజలకు సురక్షితంగా చేరవేసేందుకు ప్రభుత్వానికి సహకరించడానికి అపోలో ఆసుపత్రి సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు.

appolo hospitals vice president shobhana kamineni announces ready to vaccine supply
వ్యాక్సిన్ సరఫరాలో ప్రభుత్వానికి సహకరిస్తాం: శోభనా కామినేని

ఈ ఏడాది చివరి నాటికి దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్​పర్సన్ శోభనా కామినేని అభిప్రాయపడ్డారు. కొవిడ్- 19 వ్యాక్సిన్ పంపిణీకి అపోలో సన్నద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జూబ్లిహిల్స్​లోని అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా త్వరలో కొవిడ్- 19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో వ్యాక్సిన్ సరఫరా అనేది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

వ్యాక్సిన్ సరఫరాకు ప్రభుత్వానికి సహరించేందుకు అపోలో సన్నద్ధంగా ఉందన్న శోభనా కామినేని... ఏటా ౩౦౦ మిలియన్ల డోస్​లు సురక్షితంగా ప్రజలకు అందించే కోల్డ్​చైన్ తమకు ఉందన్నారు. 10 వేల మంది అపోలో నిపుణులు సైతం వ్యాక్సిన్​ని సురక్షితంగా అందించేందుకు శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్ అతి తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మానవ శరీరంలో వ్యాక్సిన్ ఏడాది వరకు సమర్థంగా పనిచేసే అవకాశం ఉందని, ఆ తర్వాత బూస్టర్ డోస్​లు అవసరం పడవచ్చని తెలిపారు.

ఇదీ చూడండి: ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.