ETV Bharat / business

'26/11' ఐకమత్యం భవిష్యత్తులోనూ ఉండాలి: టాటా

author img

By

Published : Nov 26, 2020, 4:15 PM IST

ప్రముఖ వ్యాపారవేత్తలు రతన్​ టాటా, ఆనంద్​ మహీంద్రా.. 26/11 ఉగ్రదాడులకు గురువారంతో 12ఏళ్లు నిండిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​లు చేశారు. ఆ రోజున ప్రదర్శించిన ఐకమత్యం భవిష్యత్తులోనూ ఉండాలని పిలుపునిచ్చారు రతన్​ టాటా. భయాన్ని జయించడమే ధైర్యానికి అర్థమన్న నెల్సన్​ మండేలా వ్యాఖ్యలను ఆ రోజున ముంబయి వాసులు నిజం చేశారన్నారు ఆనంద్​ మహీంద్రా.

26/11: Ratan Tata calls for unity, act of sensitivity to continue in future
'26/11' ఐకమత్యం భవిష్యత్తులోనూ ఉండాలి: టాటా

26/11 ఉగ్రదాడులకు స్పందనగా ముంబయి చూపించిన ఐకమత్యం, దయ, సున్నితత్వాన్ని భవిష్యత్తులోనూ ప్రదర్శించాలని పిలుపునిచ్చారు దిగ్గజ వ్యాపారవేత్త రతన్​ టాటా. ఉగ్రదాడికి గురువారంతో 12ఏళ్లు నిండిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు టాటా.

"12ఏళ్ల క్రితం జరిగిన ఘటనను ఎప్పటికీ మరచిపోలేము. ప్రాణాలు కోల్పోయిన వారికి ఈరోజున మనం నివాళులర్పిస్తాం. శత్రువులను ఓడించేందుకు కృషిచేసిన ధైర్యవంతుల త్యాగాన్ని గౌరవిస్తాం. అయితే ఆ రోజున.. విభేదాలు పక్కనపెట్టిన ముంబయి వాసులు ముందుకొచ్చి ప్రదర్శించిన ఐకమత్యం, దయ చిరస్మరణీయం."

--- రతన్​ టాటా, టాటా సన్స్​ మాజీ ఛైర్మన్.

మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌​ ఆనంద్​ మహీంద్రా ట్విట్టర్​ వేదికగా 26/11 ఉగ్రదాడులను గుర్తుచేసుకున్నారు. ముంబయి వాసులు ధైర్యాన్ని ప్రదర్శించారన్నారు.

"అనిశ్చితి, అభద్రతా భావం నెలకొన్న ఆ రోజును ముంబయి వాసులు ఎప్పటికీ మరచిపోలేరు. నగరంతో పాటు దేశంపైనా దండయాత్ర జరుగుతున్నట్టు ఆ సమయంలో నాకు అనిపించింది. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని నేర్చుకున్నా. "ధైర్యంగా ఉండటం అంటే భయం లేకపోవడం కాదు.. నిజానికి ధైర్యంగా ఉండటం అంటే భయాన్ని జయించడమే" అన్న నెల్సన్​ మండేలా వ్యాఖ్యలను మనం నిజం చేశాం."

--- ఆనంద్​ మహీంద్రా, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌.

ఇదీ చూడండి:- ముంబయి ఉగ్రదాడుల్లో అమరులకు నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.