ETV Bharat / briefs

పాపం పశువులు.. ఆదుకున్న పోలీసులు

author img

By

Published : May 16, 2019, 11:51 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం పంతంగి టోల్​ గేట్​ వద్ద నిబంధనలకు విరుద్ధంగా పశువులను కుక్కి తీసుకెళ్తున్న వారిపై జంతు హింస నిరోధక చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

జంతు హింస చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు

నిబంధనలకు విరుద్ధంగా పశువులను కుక్కి తీసుకెళ్తున్న వాహనాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం పంతంగి టోల్​ గేట్​ వద్ద స్వాధీనం చేసుకున్నారు. రెండు దూడలు పట్టే బొలేరో వాహనంలో 10 దూడలను రవాణా చేస్తున్న వాహన యజమానిపై జంతు హింస నిరోధక చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. కనీస ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ దూడలను గోశాలకు తరలించనున్నట్లు చౌటుప్పల్​ పోలీస్​ ఇన్​స్పెక్టర్​ వెంకటేశ్వర్లు తెలిపారు.

జంతు హింస చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు

ఇదీ చదవండిః మూతపడిన చెప్పుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.