నిబంధనలకు విరుద్ధంగా పశువులను కుక్కి తీసుకెళ్తున్న వాహనాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. రెండు దూడలు పట్టే బొలేరో వాహనంలో 10 దూడలను రవాణా చేస్తున్న వాహన యజమానిపై జంతు హింస నిరోధక చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. కనీస ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ దూడలను గోశాలకు తరలించనున్నట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చదవండిః మూతపడిన చెప్పుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం