ETV Bharat / crime

Tragedy : ఒకే వీధిలో ముగ్గురు యువతులు అదృశ్యం.. చెరువులో మృతదేహాలు

author img

By

Published : Oct 28, 2021, 1:51 PM IST

Updated : Oct 28, 2021, 4:03 PM IST

ఒకే వీధిలో ముగ్గురు యువతుల అదృశ్యం
ఒకే వీధిలో ముగ్గురు యువతుల అదృశ్యం

13:47 October 28

Tragedy : ఒకే వీధిలో ముగ్గురు యువతులు అదృశ్యం.. చెరువులో మృతదేహాలు

జగిత్యాల జిల్లా ఉప్పరిపేటలో విషాదం(tragedy) చోటుచేసుకుంది. బుధవారం రోజున అదృశ్యమైన ముగ్గురు యువతు(Three young women were missing)ల మృతదేహాలు ఇవాళ ధర్మసముద్రం చెరువులో లభ్యమయ్యాయి.

ఉప్పరిపేట గ్రామంలో ఒకే వీధికి చెందిన ముగ్గురు యువతులు వందన, మల్లిక, గంగాజల బుధవారం రోజున అదృశ్యమయ్యారు(Three young women were missing). సాయంత్రమైనా ఇంటికి రాకపోవడం వల్ల వారి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరి కోసం బుధవారం రోజంతా గాలించారు. ఈ ముగ్గురు బంధువులేనని స్థానికులు పోలీసులకు చెప్పారు.

చివరకు.. గురువారం మధ్యాహ్నం.. ధర్మసముద్రం చెరువులో మృతదేహాలు(three young women found dead in a pond) తేలడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహాలు వెలికితీసిన పోలీసులు వారిని.. అదృశ్యమైన యువతుల్లో గంగాజల, మల్లికలుగా గుర్తించారు. మరో యువతి వందన కోసం చెరువులో గాలించగా.. కాసేపటికి మూడో యువతి మృతదేహాం కూడా దొరికింది. ఈ ఘటనకు సంబంధించి కారణాలేవి ఇంకా తెలియదని.. ముగ్గురు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమింకంగా భావిస్తున్నారు. 

Last Updated :Oct 28, 2021, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.