ETV Bharat / bharat

Varun Singh: మృత్యువుతో పోరాడి ఓడిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​

author img

By

Published : Dec 15, 2021, 12:49 PM IST

Updated : Dec 15, 2021, 2:42 PM IST

Chopper crash: Group Captain Varun Singh passes away
వరుణ్​ సింగ్​, Chopper crash: Group Captain Varun Singh passes away

12:47 December 15

Varun Singh: మృత్యువుతో పోరాడి ఓడిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​

Varun Singh: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో గాయపడ్డ గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది.

డిసెంబర్​ 8న తమిళనాడు కూనూర్​ సమీపంలో చాపర్​ క్రాష్​ అయ్యింది. ఈ ఘటనలో 13 మంది చనిపోయినట్లు వాయుసేన అదేరోజు ప్రకటించింది. మృతుల్లో భారత త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది సిబ్బంది మరణించారు.

Chopper Crash: తీవ్రంగా గాయపడ్డ గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​కు తొలుత వెల్లింగ్టన్​ మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కొద్దిరోజులకు బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు.

8 రోజులు మృత్యువుతో పోరాడిన అనంతరం బుధవారం కన్నుమూశారు.

వాయుసేన సంతాపం..

వరుణ్​ సింగ్​ మృతి పట్ల వాయుసేన సంతాపం తెలిపింది. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

వరుణ్​ సింగ్​ మృత్యువుతో​ పోరాడి ఓడారని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ అన్నారు. ఆయన ధైర్యసాహసాలు ప్రదర్శించారని ట్వీట్​ చేశారు. వరుణ్​ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ​

PM Narendra Modi condolences:

గ్రూప్​ కెప్టెన్​ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన మృతి తనను బాధించిందని, దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేవని ట్వీట్​ చేశారు.

వరుణ్​ సింగ్​ కుటుంబసభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​కర్​, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ప్రముఖులు.. వరుణ్​ సింగ్​ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

శౌర్య చక్ర..

వరుణ్​ సింగ్​ తండ్రి.. ఏఏడీ(ఆర్మీ ఎయిర్​ డిఫెన్స్​)లో విధులు నిర్వహించారు. వరుణ్​ సోదరుడు తనూజ్​.. ప్రస్తుతం నేవీలో లెఫ్టినెంట్​ కమాండర్​.

ఉత్తర్​ప్రదేశ్​లోని గాజీపుర్​కు చెందిన వరుణ్​ ఇప్పటికే ఓసారి మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చారు. గతేడాది అక్టోబర్​లో.. ఆయన నడుపుతున్న తేజస్​ విమానంలో.. గాలిలో ఉన్న సమయంలోనే అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో వరుణ్​.. విమానం నుంచి దూకేందుకు ఆస్కారం ఉంది. అయినప్పటికీ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ, సమయస్ఫూర్తితో విమానాన్ని నడిపారు. పరిస్థితులను అర్థం చేసుకుని విమానాన్ని సురక్షితంగా నేలకు తీసుకొచ్చారు. వరుణ్​ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆయన్ని శౌర్య చక్రతో సత్కరించింది.

ఇవీ చూడండి: Bipin Rawat last speech: బిపిన్ రావత్​ చివరి సందేశం.. ఏం మాట్లాడారంటే..?

నేలరాలిన త్రిదళపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌

Last Updated :Dec 15, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.