ETV Bharat / bharat

పట్టువిడవని యువఇంజినీర్లు- సొంత పవర్ ప్లాంట్ నిర్మాణం, ప్రభుత్వానికే కరెంట్ అమ్మకం

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 10:15 PM IST

Youth Built Hydel Power Project in Idukki
Youth Built Hydel Power Project in Idukki

Youth Built Hydel Power Project in Idukki : కేరళలోనే తొలి ప్రైవేట్​ జలవిద్యుత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు ఏడుగురు యువకులు. పట్టుదలతో సాధిస్తే కానిదేది లేదని నిరూపించారు. 2014 నుంచి ప్రయత్నాలు చేపట్టిన యువకులు.. 2018లో ప్రాజెక్ట్​ను పూర్తి చేసి విద్యుత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు సైతం విద్యుత్​ను విక్రయిస్తున్నారు.

పట్టువిడవని యువఇంజినీర్లు- సొంత పవర్ ప్లాంట్ నిర్మాణం, ప్రభుత్వానికే కరెంట్ అమ్మకం

Youth Built Hydel Power Project in Idukki : జలవిద్యుత్ ప్రాజెక్ట్ అనగానే చాలా ప్రయాసతో కూడుకున్న వ్యవహారం.. కేవలం ప్రభుత్వాలు మాత్రమే చేయగలవని అనుకుంటారు. కానీ, కేరళ ఇడుక్కికి చెందిన ఏడుగురు యువ ఇంజినీర్లు.. మాత్రం అలా అనుకోలేదు. తామే సొంతంగా ఓ జల విద్యుత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లుగా కార్యాచరణ చేపట్టారు. చివరకు అనుకున్నది సాధించారు.

Youth Built Hydel Power Project in Idukki
డ్యామ్​కు వస్తున్న నీరు

సొంతంగా జలవిద్యుత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాలని భావించిన ఏడుగురు యువకులు.. 2014లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన చిన్న తరహా జల విద్యుత్పత్తి విధానంలో భాగంగా 1 మెగావాట్​ సామర్థ్యం గల ప్రాజెక్ట్​కు అనుమతులు అడిగారు. అయితే, 2018లో ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్​ పనులు ప్రారంభించారు. అనేక కష్టాలను ఎదుర్కొని ఈ ప్రాజెక్ట్​ను పూర్తి చేశామని చెబుతున్నారు యువ ఇంజినీర్ రాకేశ్ రాయ్.

Youth Built Hydel Power Project in Idukki
పవర్​ హౌజ్​లో ఇంజినీర్లు

"ఇది కేరళలోనే తొలి ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్​ ప్రాజెక్ట్​. దీని కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి.. తన సొంతం స్థలంలోనే ప్రాజెక్ట్ నిర్మిస్తానంటూ ప్రభుత్వ అనుమతి కోరాలి. ఈ విషయాన్ని 2012లో తీసుకువచ్చిన చిన్న తరహ జలవిద్యుత్పత్తి విధానంలో పొందుపర్చారు. దీని ప్రకారం చిన్న ప్రైవేట్ జలవిద్యుత్​​ ప్రాజెక్టులను.. యజమాని సొంత స్థలంలోనే నిర్మించుకోవాల్సి ఉంటుంది."

--రాకేశ్​ రాయ్​, సీఎండీ

2018లో పనులు ప్రారంభించిన యువకులు.. ఇక్కడి నీటి లభ్యతను గమనించి ప్రాజెక్ట్​ను 4 మెగావాట్లకు పెంచాలని నిర్ణయించారు. రాకేశ్​ రాయ్​తో పాటు ఉన్ని శంకర్, నితీశ్​, రెంజిని, సిరియాక్​ జోస్​, ఫారిస్​, రిజో జోసెప్​ అనే యువకులు ఈ ప్రాజెక్ట్​లో భాగం పంచుకున్నారు.

Youth Built Hydel Power Project in Idukki
డ్యామ్​ కోసం ఏర్పాటు చేసిన పైప్​లైన్​

"ఏడుగురు యువ ఇంజినీర్ల చొరవతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. 4 మెగావాట్ల ఉత్పత్తికి ఈ ప్రాజెక్ట్ సరిపోతుంది. ముక్కుడం నుంచి వస్తున్న నీటిని వివిధ ప్రాంతాల్లో నిలిపి విద్యుత్​ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కరెంట్​తోనే ప్రాజెక్ట్​ను నడుపుతున్నారు."

--సంతోశ్​ టీ అబ్రహం, ఈఈ కేఎస్​ఈబీ

ఈ ప్రాజెక్ట్​ కోసం చతురక్కల్లిప్పర వద్ద 10 మీటర్ల ఎత్తు, 29.4 మీటర్ల పొడవైన ఓ డ్యామ్​ను కట్టారు. ఈ ప్రాజెక్ట్ వద్దకు నీటిని తరలించడానికి సుమారు 1.31 కిలోమీటర్ల దూరం పైప్​లైన్​ను వేశారు. 1068 మీటర్ల దిగువన ఓ పవర్​ హౌజ్​ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్​ విద్యుత్పత్తి అంచనా ఏడాదికి 1.1కోట్ల యూనిట్స్​. కాగా.. ఈ ప్రాజెక్ట్​ నిర్మాణానికి సుమారు రూ.31 కోట్లు ఖర్చు అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలకు సైతం విద్యుత్​ను విక్రయిస్తున్నారు.

Youth Built Hydel Power Project in Idukki
పవర్​ హౌజ్​లో ఇంజినీర్లు
Youth Built Hydel Power Project in Idukki
పవర్​ హౌజ్​

చెత్తతో కారు తయారు చేసిన రైతు- ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు జర్నీ

రిక్షావాలా టు క్యాబ్ కంపెనీ ఓనర్​- ఇంటర్​ చదివి ఐఐటీయన్లకు ఉద్యోగాలు- ఈయన సక్సెస్​ స్టోరీ అదుర్స్​

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.