ETV Bharat / bharat

మూగజీవాలపై 'మహిళ' కర్కశత్వం.. రాత్రిళ్లు వెంటాడి, వేటాడి మరీ!

author img

By

Published : Apr 13, 2022, 4:02 PM IST

Woman killed Dog Puppies Out of Anger
Woman killed Dog Puppies Out of Anger

Woman killed Dogs pup Pune: ఓ మహిళ మూగజీవాలపై కర్కశంగా ప్రవర్తించింది. రాత్రిళ్లు వేటాడి రెండు కుక్క పిల్లలను చంపింది. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వాటిని ఎందుకు చంపిందంటే?

Woman killed Dogs pup Pune: మనుషులు రానురానూ మానవత్వాన్ని మరచిపోతున్నారు. మూగజీవాలపైనా కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మహారాష్ట్ర పుణెలోని హడ్పసర్​లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పట్టరాని కోపంతో.. రెండు కుక్క పిల్లలను వేటాడి చంపింది. ఆమె కర్ర పట్టుకొని రాత్రిళ్లు వీధుల్లో తిరిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికంగా ఉండే ఓ మహిళ ఫిర్యాదు మేరకు.. నిందితురాలు అనితా దిలీప్​ ఖాప్టేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Woman killed Dog Puppies Out of Anger Girl Had Been Bitten by Dog in Pune
చనిపోయిన కుక్క పిల్లలు

అసలేమైందంటే? కొద్దిరోజుల కిందట.. నిందితురాలు అనిత చిన్న కుమార్తెను ఓ శునకం కరిచింది. దీంతో పగ పెంచుకున్న ఆమె వాటిని చంపేయాలని, ఏ కుక్కనూ వదలొద్దని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పెద్ద కర్ర పట్టుకొని వీధులంతా తిరుగుతూ రెండు చిన్న పిల్లల్ని చంపేసింది. దీనిపై ఓ మహిళ పోలీసులను ఆశ్రయించగా.. వారు నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Woman killed Dog Puppies Out of Anger Girl Had Been Bitten by Dog in Pune
సీసీటీవీలో నమోదైన మహిళ దృశ్యాలు

ఇవీ చూడండి: రెండు కాలేజీల విద్యార్థుల వీరంగం.. రాళ్లు రువ్వుకుంటూ..!

'నడిస్తే నేరం.. పాకుతూ వెళ్లండి'.. పంజాబీలపై ఆంగ్లేయుల పైశాచికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.