ETV Bharat / bharat

భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య

author img

By

Published : Dec 31, 2021, 4:30 PM IST

Woman jumps into well with kids: భర్తతో గొడవపడిన ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. నలుగురు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్ర​లో జరిగింది.

Woman jumps into well with kids:
బావిలో దూకి మహిళ ఆత్మహత్య

Woman jumps into well with kids: మహారాష్ట్రలో అత్యంత విషాద ఘటన వెలుగు చూసింది. భర్తతో గొడవపడిన ఓ మహిళ ఘోర నిర్ణయం తీసుకుంది. తన నలుగురు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

అసలేమైందంటే..?

Maharashtra jalna news: జల్నా జిల్లా ఘుంగర్డే హడ్గావ్ ప్రాంతానికి చెందిన జ్ఞానేశ్వర్​ ప్రల్హాద్​ అడాణీ​, గంగసాగర్ అడాణీ దంపతులు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా జ్ఞానేశ్వర్​, గంగసాగర్ మధ్య​ తరచూ గొడవలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గంగసాగర్ తన పిల్లలతో కలిసి పొలం వద్దకు వెళ్లింది. సాయంత్రం 5:30 గంటల వరకు ఆమె అక్కడే ఉంది.

అయితే.. రాత్రి 7 గంటలైనప్పటికీ గంగసాగర్​ తిరిగి ఇంటికా రాలేదు. దాంతో ఆమె భర్త సహా గ్రామస్థులు గంగసాగర్​తో పాటు పిల్లల కోసం అర్ధరాత్రి వరకు వెతికారు. అయినప్పటికీ.. వారి ఆచూకీ కనిపించలేదు. అయితే... శనివారం ఉదయం జ్ఞానేశ్వర్ అడాణీ పొలానికి సమీపంలోని ఓ బావిలో గంగసాగర్ సహా ఆమె పిల్లలు మృతదేహాలు తేలుతూ కనిపించాయి.

Woman jumps into well with kids:
గంగసాగర్ అడాణీ
Woman jumps into well with kids:
భక్తి
Woman jumps into well with kids:
ఈశ్వరి
Woman jumps into well with kids:
అక్షర
Woman jumps into well with kids:
యువరాజ్​

సమాచారం అందిన వెంటనే.. ఇన్​స్పెక్టర్​ శీతల్​ కుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. బావి నుంచి.. గంగసాగర్​తో పాటు భక్తి(13), ఈశ్వరి(11), అక్షర(9), యువరాజ్​(7) మృతదేహాలను బయటకు తీశారు. గంగసాగర్ అడాణీ భర్త జ్ఞానేశ్వర్​ను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: చెన్నైలో భారీ వర్షాలు- విద్యుదాఘాతానికి ముగ్గురు బలి

ఇదీ చూడండి: పాపం.. ప్రాణాలు తీసిన నకిలీ బ్యాంక్​ అకౌంట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.