ETV Bharat / bharat

మహిళపై సామూహిక అత్యాచారం.. రూ. 15లక్షలు చోరీ!

author img

By

Published : Jul 7, 2021, 9:33 PM IST

మహిళపై సామూహిక అత్యాచారం చేయటమే కాక.. ఇంట్లో ఉన్న రూ. 15లక్షలు దోచుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన బంగాల్​లో జరిగింది.

woman gang raped
సామూహిక అత్యాచారం

పశ్చిమ్​ బంగా.. కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్‌లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి.. 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ ఇంట్లో ఉన్న రూ.15లక్షల నగదు దోచుకెళ్లినట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు.

ఆ కోణంలో దర్యాప్తు..

మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్టు తెలిపారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. ఇది ఆమెకు తెలిసిన వారి పనే అయి ఉంటుందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అత్యాచారం చేసిన అనంతరం ఫ్లాట్‌లో ఉన్న రూ.15లక్షల నగదు ఎత్తుకెళ్లినట్టు పేర్కొన్నారు.

గార్డెన్‌ రీచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళ బుధవారం ఫిర్యాదు చేశారని, కోల్‌కతా పోలీస్‌ డిటెక్టివ్‌ డిపార్టుమెంట్‌ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. అత్యాచారానికి ముందు మహిళను కట్టేసి ఉంచినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

ఆ మహిళ ఫ్లాట్‌ నుంచి ఫోరెన్సిక్‌ బృందం శాంపిల్స్‌ను సేకరించిందని, అలాగే, ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి: రాజధానిలో మాజీ మంత్రి భార్య దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.