ETV Bharat / bharat

పాక్​ గెలిచినందుకు భార్య ఖుష్​.. పోలీసులకు భర్త ఫిర్యాదు

author img

By

Published : Nov 6, 2021, 8:10 PM IST

T20 world cup
పాక్​ గెలిచినందుకు భార్య ఖుష్​.. పోలీసులకు భర్త ఫిర్యాదు

టీ20 ప్రపంచకప్​లో భాగంగా భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓటమిని అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆ సమయంలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ మహిళ పాక్​ గెలుపుపై సంబరాలు చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

2021 టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో భారత్​ ఓడిపోయింది. ఈ విషయాన్ని టీమ్​ఇండియా అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​ రామ్​పుర్​లో ఓ ఘటన వార్తల్లో నిలిచింది. పాకిస్థాన్​కు మద్దతు తెలిపిన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడో వ్యక్తి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది..

గత నెల అక్టోబరు 24న భారత్​-పాకిస్థాన్​ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లో భారత్​పై పాక్​ విజయం సాధించింది. ఆ సమయంలో దిల్లీలో తన స్నేహితులతో కలిసి మ్యాచ్​ చూసిన ఇషాన్​ మియాన్​ అనే వ్యక్తి మిగతా భారత అభిమానుల్లానే డీలా పడిపోయాడు. అదే సమయంలో తన వాట్సాప్​ చూడగా.. అందులో పాక్​ గెలుపును ఆనందిస్తున్నట్లు తన భార్య స్టేటస్​ కనిపించింది.

దీంతో కోపం తెచ్చుకున్న ఇషాన్​ మియాన్​ రామ్​పుర్​ ఎస్​పీని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. తన భార్యపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. భారత్​పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆరోపించాడు.

రబియా స్టేటస్​ ఆధారంగా పోలీసులు సెక్షన్​ 153ఏ, 66 కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని త్వరలోనే అరెస్ట్​ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి : 'భాజపా, ఆరెస్సెస్​లతో జాగ్రత్త.. ఆ విషయంలో వెనకాడరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.