ETV Bharat / bharat

బైడెన్​కు ముంబయితో సంబంధమేంటి?

author img

By

Published : Nov 8, 2020, 6:04 PM IST

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్​కు.. ముంబయితో చాలా ఏళ్ల అనుబంధం ఉందంటే నమ్మగలమా..? అందులోనూ వ్యక్తిగతంగా, కుటుంబానికి సంబంధించిన ఓ కనెక్షన్​ అంటే ఎలా ఉంటుంది..? ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

When Biden spoke of distant relatives living in Mumbai
బైడెన్​కు ముంబయితో ఉన్న సంబంధమేంటి?

జో బైడెన్​.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత. మరో రెండు నెలల్లో శ్వేతసౌధానికి చేరతారు బైడెన్​. ఇప్పుడు బైడెన్​ పేరు ప్రపంచ దేశాల్లో మారుమోగిపోతోంది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం అంటే మాటలా? మరి ఆ స్థాయి వ్యక్తికి మన భారత దేశంలోని ముంబయితో ఓ ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఈ విషయాన్ని ఆయనే అనేక సందర్భాల్లో వెల్లడించారు. ఇంతకీ ఏంటి ఆ సంబంధం?

ఆ లేఖతో..

1972లో యూఎస్​ సెనేటర్​గా ఎంపికయ్యారు బైడెన్​. అత్యంత పిన్నవయసులోనే ఈ పదవి చేపట్టి రికార్డు సృష్టించారు. అయితే ఆ సమయంలో బైడెన్​ను అభినందిస్తూ ముంబయి నుంచి ఓ లేఖ వచ్చిందట. అది పంపిన వ్యక్తి పేరు చివరన బైడెన్​ ఉండటం విశేషం. అంతేకాదు 'ముంబయి బైడెన్'​ పంపిన లేఖలో డెలావేర్​ సెనేటర్​గా​ బైడెన్​ ఎంపికైనందుకు అభినందనలు చెప్తూనే.. ఇద్దరికి సంబంధం ఉందని అందులో పేర్కొన్నారట.

29 ఏళ్ల వయసున్న సెనేటర్​ బైడెన్..​ ఆ సమయంలోనే లేఖ రాసిన 'ముంబయి బైడెన్​'ను కలవాలనుకున్నారట. అయితే కుటుంబం సహా తాను రాజకీయాల్లో బిజీ అవడం వల్ల కుదరలేదని చెప్పారు. ఆ తర్వాత పలు వేదికలపై ఆ స్టోరీలను పంచుకున్నారు.

ఇదీ చూడండి:- 'బైడెన్​ అనే నేను.. అమెరికన్లను ఒక్కటి చేస్తాను'

స్టోరీలు చెప్తూనే..

భారతీయ​-అమెరికన్లు, భారతీయ రాజకీయ నేతలను కలిసిన ప్రతిసారి 'ముంబయి బైడెన్' కథ చెప్తూనే ఉండేవారట జో బైడెన్​.

2013, జులై 24న ముంబయిలోని బాంబే స్టాక్​ ఎక్స్చేంజీని అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో సందర్శించారు బైడెన్​. ఆ సమయంలో 'ముంబయి బైడెన్' స్టోరీని కార్యక్రమంలోని ప్రేక్షకులతో పంచుకున్నారు.

"భారత్​లోని ముంబయికి రావడం గౌరవంగా భావిస్తున్నా. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. నాకు బాగా గుర్తుంది. నేను 29 ఏళ్ల వయసులో 1972లో యూఎస్​ సెనేట్​గా ఎంపికయ్యాను. అయితే ఆ సమయంలో ఓ లేఖ అందుకున్నాను. కానీ నేను దాన్ని ఫాలోఅప్​ చేయలేకపోయాను. ఎవరైనా వంశావళి గురించి అధ్యయనం చేస్తున్నవారు ఆడియన్స్​లో ఉంటే నాకోసం వారిని ఫాలో అప్​ చేయాలి. బైడెన్​ అనే పేరుతో ఆ లేఖ ముంబయి నుంచి వచ్చింది. కచ్చితంగా ఆ వ్యక్తితో నాకు ఏదో అనుబంధం ఉందని అనుకుంటున్నా. 1700 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా ట్రేడింగ్ కంపెనీ కోసం మా పూర్వీకులు ముంబయికి వచ్చారు."

----జో బైడెన్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేత

పోటీచేస్తున్నానంటూ నవ్వించారు..

"నేను దాని గురించి ఇప్పటికీ ఆలోచిస్తున్నాను. అది నిజమైతే నేను భారత్​లో ఆఫీస్​ పెట్టుకోవచ్చు. భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను అర్హత పొందవచ్చు. కానీ నేను అప్పుడు ముంబయి నుంచి వచ్చిన ఆ లేఖను సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు నేను చాలాసార్లు తిరిగి వచ్చాను. 'ముంబయి బైడెన్'​తో నాకు సంబంధం ఉందా అని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు అతడు ఉంటే మంచి స్థితిలో ఉంటాడని నేను నమ్ముతున్నాను" అని బైడెన్ 2013లో ముంబయిలోని కార్యక్రమంలో మాట్లాడుతూ సరదాగా ఆ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.

ఇదీ చూడండి:- ఓడింది ట్రంప్​ మాత్రమే.. 'ట్రంపిజం' కాదు!

మరోసారి...

వాషింగ్టన్​లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ దీనిని ప్రస్తావించారు బైడెన్​. తన పూర్వీకులకు, ముంబయిలోని బైడెన్​ పూర్వీకులకు సంబంధం ఉందని అభిప్రాయపడ్డారు. ఈస్ట్​ ఇండియా కంపెనీలో పనిచేసేందుకే వాళ్లు ముంబయికి వెళ్లారని అన్నారు.

"ముంబయి బైడెన్​ 1848లో ముంబయికి వెళ్లారు. ఈస్ట్​ ఇండియా టీ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు భారతీయ మహిళను పెళ్లి చేసుకున్నారు. భారత్​లోనే స్థిరపడ్డారు" అని యూఎస్​-ఇండియా బిజినెస్​ కౌన్సిల్​ సమావేశంలో చెప్పారు జో బైడెన్​. ఈ కార్యక్రమం 2015 సెప్టెంబర్​ 21న జరిగింది.

ముంబయిలో ప్రసంగం తర్వాత ఓ జర్నలిస్టు ఐదుగురు బైడెన్​లు ముంబయిలో ఉంటున్నారని ఓ జాబితా తనకు అందజేసినట్లు వాషింగ్టన్​ డీసీ ఈవెంట్​లో బైడెన్​ చెప్పుకొచ్చారు. అయితే అధ్యక్ష పదవిని బైడెన్​ దక్కించుకున్నప్పటికీ.. ముంబయి నుంచి ఏ ఒక్కరూ ముందుకువచ్చి ఆయనతో తమ బంధాన్ని చెప్పకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి:- అధ్యక్షుడిగా బైడెన్​ తొలి సంతకం దేనిపై?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.