ETV Bharat / bharat

పెళ్లిచూపుల జాతర.. 250 మంది అమ్మాయిల కోసం 11వేల మంది యువకుల పోటీ

author img

By

Published : Nov 14, 2022, 9:09 PM IST

సాధారణంగా యువరైతులు పెళ్లి చూపులకు వెళ్తే అమ్మాయిని ఇచ్చేందుకు నిరాకరిస్తారు. పెళ్లి కుమారుడు ఏం చేస్తున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అబ్బాయి రైతు అని చెప్పగానే అమ్మాయిని ఇచ్చేందుకు వెనకాడుతున్నారు. కర్ణాటకలోని మండ్యలో నిర్వహించిన భారీ పెళ్లిచూపుల కార్యక్రమం.. యువ రైతులు పెళ్లి కోసం ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

bridegrooms convention in mandya
భారీగా హాజరైన వధూవరులు

పెళ్లిచూపుల కోసం భారీ పోటీ

దేశానికి రైతే రాజు, వెన్నుముక అని నానుడి వింటుంటాం. అయితే ప్రస్తుత కాలంలో యువరైతులకు పెళ్లి కావాలంటే నానా కష్టాలు పడాల్సి వస్తోంది. వధువుల తల్లిదండ్రులు రైతులకు తమ అమ్మాయిలను ఇచ్చి వివాహం చేసేందుకు ముందుకు రావడం లేదు. అలాంటి పరిస్థితిని నివారించేందుకు కర్ణాటక మండ్య జిల్లాలోని ఆదిచుంచనగిరిలో ఒక్కలిగ కులస్థులు.. వధూవరుల సమ్మేళనాన్ని నిర్వహించారు. మండ్య జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువకులు ఈ సమ్మేళనానికి తరలివచ్చారు.

bridegrooms convention in mandya
పెళ్లి చూపుల యువరైతులు, వారి తల్లిదండ్రులు

ఈ పెళ్లిచూపుల సమ్నేళనానికి 250 మంది అమ్మాయిలు రాగా.. వారిని చూసుకోవడానికి 11,775 మంది యువకులు తరలివచ్చారు. వీరందరూ యువరైతులు, రైతు కుటుంబానికి చెందినవారే కావడం విశేషం. ఒక్కలిగ సంఘం కన్వెన్షన్​లో దాదాపు 12,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. పెళ్లిచూపులకు వచ్చిన యువకుల క్యూలైన్​ చూసి అందరూ షాక్ అయ్యారు.

bridegrooms convention in mandya
పెళ్లి చూపులకు హాజరైన యువకులు

ఇవీ చదవండి: క్రైమ్ సిరీస్ స్ఫూర్తితో ప్రేయసి హత్య.. శవాన్ని 35 ముక్కలు చేసి.. ఫ్రిజ్​లో ఉన్న ముఖాన్ని రోజూ చూస్తూ..

ప్రియుడితో కలిసి భర్త హత్య.. గొయ్యి తీసి పూడ్చిపెట్టిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.