ETV Bharat / bharat

గుంతలో పడ్డ సైనికుల వాహనం.. నలుగురు మృతి

author img

By

Published : Jul 24, 2022, 9:06 PM IST

accident in chamba
accident in chamba

Accident in chamba: హిమాచల్​ప్రదేశ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఘటనలో సీఆర్పీఎఫ్​ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు..ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11మంది జవాన్లు గాయపడ్డారు.

Accident in chamba: హిమాచల్​ప్రదేశ్​ ఛంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో వాహనంలో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికార బృందం.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

గుంతలో పడ్డ ఆర్మీ వెహికల్​.. మరో ఘటనలో ప్రయాణిస్తున్న ఓ ఆర్మి వాహనం ప్రమాదానికి గురైంది. ఝార్ఖండ్​ గిరిడీలో సీఆర్పీఎఫ్​ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం.. మధుబన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని దుమ్రి రోడ్డు సమీపంలోకి రాగానే అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. ఈ బస్సు మధుబన్​ నుంచి ఛత్రాకు వెళ్తున్నట్లు పోలీస్ స్టేషన్ ఇంఛార్జీ మృత్యుంజయ్​ సింగ్​ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం దుమ్రి ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

ఇవీ చదవండి: 'యుద్ధం ఏదైనా విజయం మనదే.. అది పాక్​కు కూడా తెలుసు'

కొండపై 80అడుగుల కుంట.. 90ఏళ్ల వృద్ధుడి భగీరథ ప్రయత్నం.. 50ఏళ్లు శ్రమించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.