ETV Bharat / bharat

ఎన్​జీఓలో పనిచేసే యువతిపై గ్యాంగ్​ రేప్​.. మనస్తాపంతో..

author img

By

Published : Dec 7, 2021, 12:25 PM IST

Vadodara NGO Gang Rape: ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేసే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కిరాతకులు. తీవ్రమనస్తాపం చెందిన బాధితురాలు రైల్వే కంపార్ట్​మెంట్​లో ఉరివేసుకుని బలవర్మణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుజరాత్​లో జరిగింది.

Vadodara NGO Gang Rape
యువతిపై గ్యాంగ్​రేప్

Vadodara NGO Gang Rape: గుజరాత్​, వడోదరలో జరిగిన విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓయాసిస్​ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసే యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్టోబరు 29న ఆమెపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇదే విషయాన్ని ఎన్​జీఓలో ఉన్న స్నేహితులు, యాజమాన్యంకు బాధితురాలు తెలపగా.. ఎవరూ స్పందించలేదు. అంతేకాక పోలీస్​స్టేషన్​లోనూ ఫిర్యాదు చేయలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువతి నవంబరు 4న వల్సద్​ రైల్వేస్టేషన్​లోని రైల్వే కంపార్ట్​మెంట్​లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వడోదరా జిల్లా క్రైంబ్రాంచ్​ ఎసీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.

ఈ ఘటన జరిగిన 38 రోజుల తర్వాత.. ఎన్​జీఓలో పనిచేసే ట్రస్టీతోపాటు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

ఇదీ చూడండి: దిల్లీలో ఘోరం.. దివ్యాంగ మహిళపై పలుమార్లు అత్యాచారం

Vadodara NGO Gang Rape: గుజరాత్​, వడోదరలో జరిగిన విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓయాసిస్​ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసే యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్టోబరు 29న ఆమెపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇదే విషయాన్ని ఎన్​జీఓలో ఉన్న స్నేహితులు, యాజమాన్యంకు బాధితురాలు తెలపగా.. ఎవరూ స్పందించలేదు. అంతేకాక పోలీస్​స్టేషన్​లోనూ ఫిర్యాదు చేయలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువతి నవంబరు 4న వల్సద్​ రైల్వేస్టేషన్​లోని రైల్వే కంపార్ట్​మెంట్​లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వడోదరా జిల్లా క్రైంబ్రాంచ్​ ఎసీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.

ఈ ఘటన జరిగిన 38 రోజుల తర్వాత.. ఎన్​జీఓలో పనిచేసే ట్రస్టీతోపాటు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

ఇదీ చూడండి: దిల్లీలో ఘోరం.. దివ్యాంగ మహిళపై పలుమార్లు అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.