ETV Bharat / bharat

'కరోనా మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్లు శక్తిని అందించాయి'

author img

By

Published : Jan 16, 2022, 4:08 PM IST

Vaccination in India: దేశంలో వ్యాక్సినేషన్​ ప్రారంభమై ఆదివారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. కొవిడ్​పై పోరులో టీకాలు శక్తిని అందించాయని చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంపై కేంద్ర మంత్రి అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురింపించారు.

covid
కొవిడ్​

Vaccination in India: కరోనా మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్లు శక్తిని అందించాయని​ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వైరస్​ నుంచి ప్రజలకు రక్షణ కల్పించాయని పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేషన్​ ప్రారంభమై ఆదివారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ టీకా పంపిణీ కోసం కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

"దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు వ్యాక్సిన్​ తీసుకోవడం లేదా ఆరోగ్య కార్యకర్తలు అక్కడికి టీకాలు పంపిణీ చేయడం వంటి సందర్భాలు చూసినప్పుడు మనకు గర్వంగా ఉంటుంది. మహమ్మారిపై పోరుకు భారత్​ ఎప్పుడు శాస్త్రీయ విధానాన్నే అనుసరిస్తుంది."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ప్రతీ పౌరుడికి మెరుగైన చికిత్స అందేలా మౌలికవసతులను తీర్చిదిద్దుతున్నాం అన్నారు మోదీ.

షా ప్రశంసలు

దేశంలో టీకా పంపిణీ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. సమర్థవంతమైన నాయకత్వం, నిబద్ధతతో ప్రధాని చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.

"దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం, ప్రజలు ఏకమై ఓ లక్ష్యంతో పనిచేస్తే సాధ్యంకానిది ఏదీ ఉండదు అని భారత్​ ప్రపంచానికి మరోసారి నిరూపించింది. టీకా పంపిణీ అందుకు ఉదాహరణ. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్​ కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలు, కరోనా యోధులు, పౌరులకు నా అభినందనలు."

-అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

"దేశ ప్రజలు అందరికీ టీకా పంపిణీ చేపట్టడం అసాధ్యం అనుకున్నాం. కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అది సాధ్యమైంది. వయోజనుల్లో.. 93 శాతానికిపైగా జనాభా తొలిడోసు తీసుకున్నారు. ఈ టీకా పంపిణీపై ప్రపంచ దేశాలు మనపై ప్రశంసలు కురిపించాయి."

-జేపీ నడ్డా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 156.76 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారిలో 93 శాతం మంది తొలిడోసు, 70 శాతం మంది పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నట్లు పేర్కొన్నారు.

  • #WATCH| "As a result of country's solidarity & PM Modi's commitment during #COVID19, India not only manufactured vaccines but also vaccinated large part of population in short time," tweeted Union Health Minister Dr Mansukh Madaviya

    (Video source: Dr Mansukh Madaviya's twitter) pic.twitter.com/C3IwfvjAwy

    — ANI (@ANI) January 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి : 'సమాజ్​వాదీ'కి ఎదురుదెబ్బ.. భాజపాలోకి ములాయం కోడలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.