ETV Bharat / bharat

UP polls 2022: భాజపా ఇంటింటి ప్రచారంలో షా.. ఎస్​పీపై యోగి విమర్శలు

author img

By

Published : Jan 22, 2022, 7:18 PM IST

amit shah, yogi adityanath
అమిత్​ షా, యోగి ఆదిత్యనాథ్​

Uttar Pradesh election 2022: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ ప్రచారాలు, ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన క్రమంలో ఇంటింటి ప్రచారం చేపట్టింది అధికార భాజపా. షామిలీ జిల్లాలోని కైరానాలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. మరోవైపు.. సమాజ్​వాదీ పార్టీ అభ్యర్థుల జాబితాపై విమర్శలు గుప్పించారు సీఎం యోగి ఆదిత్యనాథ్​.

Uttar Pradesh election 2022: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నిక నగార మోగిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్రంలో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. తొలిదశలో పోలింగ్​ జరిగే షామిలీ జిల్లాలోని కైరానా నగరంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. 2014లో వలస వెళ్లి రాష్ట్రానికి తిరిగి వచ్చిన కుటుంబాలను కలిశారు షా. ఇంటిటికి వెళ్లి ఓటర్లను కలిసిన ఆయన.. భాజపా అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.

amit shah
కైరానాలో కరపత్రాలు పంచుతున్న అమిత్​ షా

"2014, జనవరి తర్వాత కైరానాకు తొలిసారి వచ్చాను. 2014 తర్వాత యూపీ అభివృద్ధికి ప్రధాని మోదీ పెద్దపీట వేశారు. 2017లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలో భాజపా ప్రభుత్వ ఏర్పాటు చేశాక అభివృద్ధిలో రాష్ట్రం మరింత దూసుకెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త అభివృద్ధి కనిపిస్తోంది. పలు రహదారులు, విమానాశ్రయాలు, విద్యుత్తు, కొవిడ్​-19 వ్యాక్సినేషన్​​ సహా ఇతర సౌకర్యాలను ప్రజలకు మోదీ, యోగి ప్రభుత్వాలు ఇచ్చాయి. ప్రతి పేద ఇంటిలో ఇప్పుడు గ్యాస్​ కనెక్షన్​, శౌచాలయం, విద్యుత్తు సౌకర్యం, ఆయుష్మాన్​ భారత్​ యోజన కార్డు ఉంది. రానున్న రోజుల్లో యూపీ అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించునుంది. మోదీ జీ తీసుకొచ్చిన అన్ని పథకాలను యోగీ జీ రాష్ట్రంలో అమలు చేశారు. కైరానాలో అది కనిపిస్తోంది. గతంలో వలస వెళ్లినవారు తిరిగొచ్చారు. "

- అమిత్​ షా, కేంద్ర హోంశాఖ మంత్రి.

కైరానాలో దివంగత నేత హుకుమ్​ సింగ్​ కూతురు మ్రిగాంక సింగ్​కు టికెట్​ ఇచ్చింది భాజపా. హుకుమ్​ సింగ్​ ఈ స్థానం నుంచి పలుమార్లు విజయం సాధించారు.

amit shah
చిన్నారికి మిఠాయి తినిపిస్తున్న కేంద్ర హోంమంత్రి

సమాజ్​వాదీ పార్టీపై యోగి విమర్శలు..

అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్​వాదీ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై విమర్శలు గుప్పించారు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన నేతలకు టికెట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలుపుతోందని ఆరోపించారు.

"సమాజ్​వాదీ పార్టీ అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించిన వారు ఉంటారు. మా హయాంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారి పోస్టర్లు గోడలపై ఉంటాయని వారికి తెలుసు. కరోనాను ఎదుర్కొంటున్న తీరులో మోదీ ప్రభుత్వంపై యావత్​ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. ఇప్పటి వరకు భారత్​లో 160 కోట్ల డోసులు అందించాం. ఆక్సిజన్​ కొరత లేదు. ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా అందిస్తున్నాం."

- యోగి ఆదిత్యనాథ్​, యూపీ ముఖ్యమంత్రి.

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: యూపీలో ముస్లింలు ఎటువైపు? యోగి '80-20' వ్యూహం ఫలించేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.