ETV Bharat / bharat

గిరిజనుడి చెవిలో మూత్రవిసర్జన.. మద్యం మత్తులో గుర్తించని బాధితుడు.. వైరల్ వీడియో చూసి..

author img

By

Published : Jul 14, 2023, 8:44 AM IST

Urinated On Tribal Man
గిరిజనుడిపై మూత్రవిసర్జన

Urination on Tribal man : గిరిజన వ్యక్తి చెవిలో మూత్రవిసర్జన చేశాడు అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి. ఘటన జరిగిన సమయంలో బాధితుడు మద్యం మత్తులో ఉన్నందున.. ఈ విషయాన్ని గుర్తించలేదు. తర్వాత దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్​ అవ్వడం వల్ల జరిగిన అవమానాన్ని బాధితుడు తెలుసుకొని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

Urination on Tribal man : గిరిజన వ్యక్తి చెవిలో మూత్రవిసర్జన చేశాడు అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి. మద్యం మత్తులో ఉన్నందున ఆ యువకుడికి తనపై మూత్రవిసర్జన జరిగిందన్న విషయం కూడా తెలీదు. మర్నాడు ఉదయం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్​గా మారడం వల్ల.. జరిగిన అవమానం గురించి బాధితుడికి తెలిసింది. దీంతో తనపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తిపై గిరిజనుడు స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ అమానుష ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం..
సోన్​భద్ర జిల్లాకు చెందిన జవహీర్ పటేల్, గులాబ్​కోర్​లకు ఇంతకుముందే పరిచయం ఉంది. జవహీర్.. పటేల్ వర్గానికి చెందిన వ్యక్తికాగా.. గులాబ్ గిరిజనుడు. జులై 11న రాత్రి వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో జవహీర్.. గులాబ్​కోల్​ చెవిలో మూత్రవిసర్జన చేశాడు. అయితే మద్యం మత్తులో ఉండటం వల్ల తనపై మూత్రవిసర్జన జరిగిన సంగతి గులాబ్​కు తెలియదు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్​ అయ్యింది. దీంతో తనకు జరిగిన అవమానం గురించి తెలుసుకున్న గులాబ్.. జవహీర్​పై ఫిర్యాదు చేశాడు. కాగా జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ సహా పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. త్వరలోనే డీఐజీ కూడా త్వరలోనే ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు.

గిరిజనుడి చెవిలో మూత్రవిసర్జన

"ఈ సంఘటన ఓబరా పోలీస్​ స్టేషన్ పరిధిలోని ఘటిహట గ్రామంలో జరిగింది. కాగా నిందితుడు, బాధితుడు ఇద్దరికీ ఇదివరకే పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి మద్యం సేవిస్తుండగా.. ఓ చిన్న విషయంపై గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన జవహీర్.. గులాబ్​ను దుర్భాషలాడుతూ అతడిపై మూత్ర విసర్జన చేశాడు. బాధితుడి ఫిర్యాదు స్వీకరించి.. జవహీర్​పై కేసు నమోదు చేశాము. ప్రస్తుతానికి ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నాం."
-యశ్వీర్ సింగ్, సోన్​భద్ర ఎస్పీ.

కాగా ఇదే జిల్లాలో కొన్ని రోజుల కిందట ఓ దళిత వ్యక్తిని కొట్టి, అతడిపై ఉమ్మివేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇటీవలే మధ్యప్రదేశ్​లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కూడా గిరిజన యువకుడిపై మూత్రవిసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఇవి మరువక ముందే వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.