ETV Bharat / bharat

Ambulance Siren In Hyderabad : మిర్చీ బజ్జీల కోసం అంబులెన్స్​ సైరన్​.. చివరికి ఏమైందంటే..

author img

By

Published : Jul 11, 2023, 3:38 PM IST

Unnecessarily Ambulance Siren Disrupting Traffic : కొందరు అంబులెన్స్‌ డ్రైవర్లు అవసరం లేకపోయినప్పటికీ.. సైరన్‌ను ఉపయోగించి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. తాజాగా నారాయణగూడలో మిర్చీ బజ్జీల కోసం డ్రైవర్​ సైరన్​ మోగిస్తూ వెళ్లిన తీరుపై.. రాష్ట్రం డీజీపీ అంజనీ కుమార్​ తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. సైరన్​ను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి.. ట్వీట్​ చేశారు.

Ambulance
Ambulance

Ambulance Siren For Mirchi Buzzi In Hyderabad : ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవి అంబులెన్స్​లు.. వాటి సేవలతో ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. సైరన్​ మోగిందంటే చాలు ఎవరో చావుబతుకులు మధ్య ఉన్నారని భావించి.. రహదారులపై వెళ్లే వాహనదారులు అంబులెన్స్​కు సైడ్​ ఇస్తారు. అయితే కొందరు ఈ అవకాశం వాడుకుని.. అవసరం లేనప్పుడు కూడా అంబులెన్స్​ సైరన్​లను మోగిస్తూ ట్రాఫిక్​కు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇంక ఈ అంబులెన్స్​లకు సైడ్​ ఇవ్వడం కూడా తప్పే అనే రీతిలోకి ప్రజలు వచ్చే విధంగా వారి చేష్టలతో విసుగెత్తిస్తున్నారు. తాజాగా కేవలం మిర్చీ బజ్జీ కోసం అంబులెన్స్​ డ్రైవర్​ తన విధులను దుర్వినియోగం చేశారు. ఈ సంఘటన ఎక్కడో కాదు.. మన హైదరాబాద్​లోనే జరిగింది. దీనిపై రాష్ట్ర డీజీపీ కూడా గరంగరం అయి.. సీరియస్​గా ట్వీట్​ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే.. నగరంలో మిర్చీ బజ్జీలు కొనడానికి ఓ అంబులెన్స్ డ్రైవర్ సైరన్ వేసి మరి అంబులెన్స్​ను వేగంగా తీసుకెళ్లాడు. నారాయణగూడ కూడలి వద్ద రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సెంచురీ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్, సైరన్ వేసుకొని వేగంగా వస్తుండటంతో సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమయ్యాడు.

Anjani Kumar Tweet For Ambulance Siren : మిగతా వాహనాలను ఆపి అంబులెన్స్​కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డ్రైవర్ వేగంగా అంబులెన్స్​ను ముందుకు పోనిచ్చి.. కాస్త దూరంలో రహదారి పక్కన నిలిపాడు. సైరన్ వేసుకొని వేగంగా వెళ్లిన అంబులెన్స్, ఆస్పత్రికి కాకుండా ఇక్కడ ఎందుకు ఆపారని ట్రాఫిక్ కానిస్టేబుల్​కు అనుమానం వచ్చింది.

మిర్చీ బజ్జీల కోసం అంబులెన్స్​ సైరన్

"సైరన్​ల దుర్వినియోగించకుండా అంబులెన్స్​ సేవలను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని కోరుతున్నాను. నిజమైన అత్యవసర పరిస్థితుల్లో వేగంగా, సురక్షితమైన మార్గం కోసం సైరన్​లను యాక్టివేట్​ చేయడం అవసరం. అంతే కాని ఇలా దుర్వినియోగం చేస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాము." - అంజనీకుమార్​, డీజీపీ ట్వీట్​

  • #TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised.

    Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN

    — Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మిర్చీ బజ్జీలు తింటూ కనిపించిన నర్సులు : వెంటనే అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్​కు.. అంబులెన్స్ డ్రైవర్ చేతిలో కూల్ డ్రింక్ సీసా పట్టుకొని కనిపించాడు. నర్స్ ఏమో మిర్చీ బజ్జీలు కొనుగోలు చేయడానికి వెళ్లింది. రహదారి పక్కనే మిర్చీ బజ్జీలు విక్రయించే దుకాణం వద్ద అంబులెన్స్ ఆపడంతో డ్రైవర్​ను ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రశ్నించాడు. రోగి లేకున్నప్పటికీ.. సైరన్ వేసుకొని అంత వేగంగా ఎందుకు వచ్చావని డ్రైవర్​ను అడిగాడు. లోపల రోగి ఉన్నాడని డ్రైవర్ బుకాయించేందుకు ప్రయత్నించినప్పటికీ.. డోర్ తీసి చూస్తే ఎవరూ కనిపించలేదు.

ఈ దృశ్యాలన్నింటినీ ట్రాఫిక్ కానిస్టేబుల్ మొబైల్​లో చిత్రీకరించాడు. ఈ వీడియోలను డీజీపీ అంజనీ కుమార్ తన ట్విటర్​లో ట్వీట్ చేశాడు. అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన సైరన్​లను కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు దుర్వినియోగం చేస్తున్నారని.. అలాంటి వాళ్లపైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అంజనీ కుమార్ హెచ్చరించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.