ETV Bharat / bharat

Booster Dose: రెండో డోస్​ తీసుకున్న 9 నెలలకు బూస్టర్!

author img

By

Published : Dec 10, 2021, 2:12 PM IST

Booster Dose in India
Booster Dose in India

Booster Dose: ఒమిక్రాన్ వ్యాప్తి​ నేపథ్యంలో బూస్టర్​ డోసు తీసుకోవచ్చని కేంద్రం తెలిపినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మూడో డోసు తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది. బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించినట్లు పేర్కొంది.

Booster Dose: గత కొద్దికాలంగా బూస్టర్ డోసుల పంపిణీపై జరుగుతున్న చర్చ.. ఒమిక్రాన్ నేపథ్యంలో మరింత జోరందుకుంది. కేంద్రం కూడా ఇదే అంశంపై గురువారం సమావేశం నిర్వహించింది. బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. అవసరమైతే, మూడో డోసు తీసుకోవచ్చని, అయితే రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మాత్రమే తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించినట్లు పేర్కొంది. పలు రకాల వేరియంట్లపై టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. 100కు పైగా దేశాలు భారత్ అందిస్తున్న టీకా ధ్రువపత్రాన్ని అంగీకరిస్తున్నాయని వివరించారు.

ఆరోగ్య శాఖ సెక్రటరీ, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, తదితరులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. దీనిలో ఒమిక్రాన్, కొవిడ్ సంబంధిత అంశాలను వెల్లడించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ను ఎదుర్కోవడం 'దొంగా-పోలీసు' ఆట లాంటిదని, అధికారులు వైరస్‌ కంటే ఒక అడుగు ముందే ఉండాలని ప్యానెల్ సభ్యులు సూచించినట్లు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. మొదట దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్‌ ఇప్పటివరకు 57 దేశాలకు విస్తరించగా.. ఈ రకం కేసులు 2,300పైగా నమోదయ్యాయి.

ఇదీ చూడండి: కరోనా సెకండ్​ వేవ్​లో వైద్యం కోసం లంచం ఇచ్చిన 40% ప్రజలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.