ETV Bharat / bharat

కరోనా సెకండ్​ వేవ్​లో వైద్యం కోసం లంచం ఇచ్చిన 40% ప్రజలు!

author img

By

Published : Dec 10, 2021, 11:58 AM IST

Bribe For Corona Treatment: కరోనా రెండో దశలో ఆస్పత్రుల్లోని విపత్కర పరిస్థితిని ఓ సర్వే తేటతెల్లం చేసింది. కరోనా రోగులు చికిత్స కోసం లంచాలు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ సమయంలో వార్డు బాయ్స్​ జేబులు ఫుల్లుగా నిండినట్లు పేర్కొంది. ఈ నివేదికలోని మరిన్ని వివరాలు..

bribe for covid treatment, corona treatment
కొవిడ్ చికిత్సకు లంచాలు

Bribe For Corona Treatment: కరోనా రెండో దశలో భారత్​లో మృత్యుఘోష వినిపించింది. రోజుకు వేల మంది మరణించారు. ఆక్సిజన్​, ఔషధాలు లేక ప్రజలు నరకం అనుభవించారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలోనూ దేశంలో అవినీతి జరిగిందని సామాజిక మాధ్యమం లోకల్​ సర్కిల్స్​ సర్వే ద్వారా బహిర్గతమైంది. సెకండ్ వేవ్​లో కరోనా చికిత్స పొందిన ప్రతి 10మంది పౌరుల్లో నలుగురు ఆరోగ్య సిబ్బందికి, ఆస్పత్రి యాజమాన్యానికి లంచాలు ఇచ్చినట్లు తేలింది. ఈ ఏడాది ఏప్రిల్​-మే మధ్య కాలంలో ఆస్పత్రులలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్, ఔషధాలు వంటి కనీస వసతుల కోసం ప్రజలు ముడుపులు చెల్లించినట్లు వెల్లడైంది.

చికిత్స అనంతరం ఆస్పత్రి వేసిన బిల్లును తగ్గించేందుకు 9శాతం మంది లంచం ఇచ్చినట్లు సర్వే స్పష్టం చేసింది. ఐసీయూలో ఉన్న తమ వారి యోగ క్షేమాలు తెలుసుకునేందుకు, వారిని సందర్శించేందుకు కూడా ప్రజలు ఇదే సంఖ్యలో డబ్బులు చెల్లించినట్లు తెలిపింది. ఆస్పత్రి పారిపాలనా విభాగం, ఇతర సిబ్బందికి ఈ ముడుపులు ఇచ్చినట్లు పేర్కొంది.

Corona second wave india

సెకండ్​ వేవ్​లో లంచాలు తీసుకుని అత్యధికంగా లబ్ధి పొందింది మాత్రం ఆస్పత్రుల్లోని వార్డు బాయ్స్ అని లోకల్ సర్కిల్స్ నివేదిక తేటతెల్లం చేసింది.

సర్వేలోని ఇతర వివరాలు..

సర్వేలో పాల్గొన్న వారిలో ఒక్కరు కూడా డాక్టర్​కు గానీ, నర్సుకు గానీ లంచం ఇచ్చినట్లు చెప్పలేదు. ఆస్పత్రులలో అవినీతి జరగకుండా ప్రభుత్వమే కఠిన నిబంధనలు తీసుకురావాలని అప్పడే డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండదని వారు అభిప్రాయపడ్డారు.

28 శాతం వార్డు బాయ్స్​కు లంచాలు ఇచ్చారు. 27శాతం మంది ఆస్పత్రుల్లో పరిపాలానా సిబ్బందికి ముడుపులు చెల్లించారు. 10శాతం మంది స్థానిక రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి మరీ ఆస్పత్రి సేవలు వినియోగించుకున్నారు.

దేశవ్యాప్తంగా 300 జిల్లాలకు చెందిన 16,000 మంది నుంచి వివరాలు సేకరించి ఈ నివేదిక రూపొందించారు. ఇందులో మెట్రో నగరాలకు చెందినవారు 40శాతానికి పైగా ఉన్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 30శాతానికి పైగా ఉన్నారు.

లోకల్ సర్కిల్స్ ఈ ఏడాది సెప్టెంబర్​లో చేసిన మరో సర్వేలో ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కోసం ప్రజలు 13శాతం అధికంగా ఫీజు చెల్లించారు. రెమ్​డెసివిర్, ఫాబిఫ్లూ, టాసిలిజుమాబ్​ వంటి ఔషధాలను రిటైల్ ధర కన్నా ఎక్కువ వెచ్చింది కొనుగోలు చేశారు.

Covid treatment news

డెల్టా వేరియంట్​ను గుర్తించిన తర్వాత భారత్​లో ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్యకాలంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. రోగుల సంఖ్య ఒక్కసారే లక్షల్లో పెరిగి ఆస్పత్రుల సరిపోక విపత్కర పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఫిల్లింగ్ కేంద్రాల వద్ద జనం సిలిండర్లతో బారులు తీరారు. కొవిడ్ చికిత్సలో అప్పుడు బాగా ఉపయోగించిన రెమ్​డెసివిర్ ఔషధం బంగారం రేటును తలపించింది. బ్లాక్ మార్కెట్ మాఫియా ఈ ఔషాధాన్ని అధిక ధరకు విక్రయించింది.

ఇదీ చదవండి: అందుకు సిద్ధంగా ఉండాల్సిందే.. రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.