ETV Bharat / bharat

నాడు ప్రాణాలు లెక్కచేయని విద్యార్థి- ఆ శునకంతో భారత్​కు సేఫ్​గా..

author img

By

Published : Mar 4, 2022, 12:18 PM IST

Updated : Mar 4, 2022, 12:40 PM IST

rishab
రిషబ్

Ukraine Russia War: పెంపుడు కుక్క కోసం ఉక్రెయిన్​లోనే ఉండిపోయిన భారతీయ విద్యార్థి ఎట్టకేలకు స్వదేశానికి వచ్చాడు. శునకాలను కూడా వెంట తెచ్చుకునేందుకు అనుమతి లభించడం వల్ల శుక్రవారం.. హంగేరీ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నాడు.

Ukraine Russia War: తాను ప్రేమగా పెంచుకుంటున్న శునకం కోసం ఉక్రెయిన్​పై రష్యా జరుపుతున్న భీకర దాడుల మధ్యే ఉండిపోయిన భారత విద్యార్థి రిషభ్​​ కౌశిక్..​ ఎట్టకేలకు తన పెంపుడు కుక్కతో భారత్ చేరుకున్నాడు. దేహ్రాదూన్​కు చెందిన రిషభ్​ ​.. ఆపరేషన్​ గంగలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున బుడాపెస్ట్​ నుంచి ప్రత్యేక విమానంలో స్వదేశానికి వచ్చాడు.

"ఇక్కడికి వచ్చేందుకు చాలా ప్రొసీజర్​ ఉంది. ఇలాంటి అత్యవసర సమయాల్లో తమ దేశస్థులను వెంటనే అనుమతించాల్సింది. పెంపుడు జంతువులను కూడా ఎలాంటి ఎన్​ఓసీ లేకుండానే భారత్​కు అనుమతిస్తున్నట్లు తెలిసింది."

-రిషభ్​​ కౌశిక్, విద్యార్థి

కొద్ది రోజుల క్రితం కౌశిక్​.. ఇన్​స్టాలో ఓ వీడియో షేర్​ చేశాడు. తన పెంపుడు కుక్కను తీసుకువచ్చేందుకు అధికారులను అనుమతి కోరగా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుక్కను వెంట తెచ్చుకునేందుకు అనుమతించే వరకు ఉక్రెయిన్​లోనే ఉంటానని పేర్కొన్నాడు.

Ukraine Russia War
రిషభ్​​ పెంపుడు కుక్క మాలిబూ

అయితే ఇటీవల కేంద్రం పెంపుడు జంతువులను కూడా తమ వెంట తీసుకువచ్చేందుకు విద్యార్థులకు అనుమతించింది. దీంతో ఉక్రెయిన్​ నుంచి భారత్​ చేరుకున్న విద్యార్థులతో పాటు పెంపుడు పిల్లులు, కుక్కలు దర్శనమిచ్చాయి. ఎలాంటి ఆంక్షలు లేకపోవడం వల్ల చాలా మంది తమ పెంపుడు శునకాలను, పిల్లులను వెంట తెచ్చుకున్నారు.

d
పెంపుడు జంతువులతో విద్యార్థులు
d
పెంపుడు కుక్కతో భారత్​ చేరుకున్న విద్యార్థి
d
పెంపుడు కుక్కను వెంట తెచ్చుకున్న విద్యార్థి

ఉక్రెయిన్​ నుంచి వస్తున్న భారతీయులకు కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతున్నారు. శుక్రవారం.. కేంద్ర మంత్రి నిషిత్​ ప్రామాణిక్​ హంగేరీ నుంచి వచ్చిన 219 మంది విద్యార్థులకు దిల్లీలో స్వాగతం పలికారు. మరో రెండు రోజుల్లో 7,400 మంది భారత్​ చేరుకోనున్నట్లు కేంద్రం వెల్లడించింది. శుక్రవారం 3500 మందిని, శనివారం మరో 3900 మందిని స్వదేశానికి తీసుకువస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి : సుమీలో 700 మంది భారత విద్యార్థులు- 7 రోజులుగా బిక్కుబిక్కుమంటూ..

Last Updated :Mar 4, 2022, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.