ETV Bharat / bharat

ఐఐఎస్​సీలో ఒకేరోజు ఇద్దరు విద్యార్థులు మృతి

author img

By

Published : Mar 4, 2021, 5:25 AM IST

Two students died in a single day at IISC
ఐఐఎస్​సీలో చనిపోయిన ఇద్దరు పరిశోధక విద్యార్థులు

బెంగళూరులోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్​లో ఇద్దరు పరిశోధక విద్యార్థులు మరణించారు. వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా... మరొకరు ఫుట్​బాల్​ ఆడుతూ చనిపోయారు.

కర్ణాటక బెంగళూరులోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్​లో మంగళవారం ఒక్క రోజే ఇద్దరు పరిశోధక విద్యార్థులు చనిపోయారు. వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. మరో విద్యార్థి పుట్​బాల్​ ఆడుతూ మరణించారు. మృతి చెందిన వారిని రణదీర్​ ​కుమార్​, రాహుల్​ ప్రతాప్​లుగా గుర్తించారు. రణదీర్ నానో సైన్స్​ అండ్​ ఇంజినీరింగ్​లో పీహెచ్​డీ చేస్తుండగా.. రాహుల్​ మెకానికల్​ ఇంజినీరింగ్​లో ఎంటెక్​ చదువుతున్నట్లు అధికారులు తెలిపారు.

రణదీర్ క్యాంపస్​లో ఉండే వసతి గృహంలోనే ఉరి వేసుకుని చనిపోగా.. రాహుల్​ మాత్రం స్థానికంగా ఉండే జింఖానా మైదానంలో పుట్​బాల్​ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో దగ్గరలోని ఎంఎస్​ రామయ్య ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు చెప్పినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: 'విద్యార్థులూ.. ఈ మూడింటిపై దృష్టి పెట్టండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.