రైలు పట్టాలపై ఇన్​స్టా రీల్స్.. చెవుల్లో ఇయర్​ఫోన్స్.. ట్రైన్ వచ్చి నేరుగా..

author img

By

Published : Dec 4, 2022, 10:41 AM IST

Two people killed by train while making reels
రీల్స్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టిన రైలు ()

సోషల్ మీడియా రీల్స్ మాయలో పడి ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. రైల్వే ట్రాక్​పై వీడియోలు చేస్తున్న ఇద్దరిని ట్రైన్ ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఇన్​స్టా, యూట్యూబ్ రీల్స్​ పిచ్చిలో పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్​ మీడియా పోస్ట్​లకు లైక్​లు, కామెంట్ల కోసం ఎంతకైనా తెగించి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ధోరణి చాలా పెరిగింది. ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రమాదకరంగా రీల్స్​ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు.. రైలు కింద పడ్డారు. వారిద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను కరణ్​, శశాంక్​లుగా పోలీసులు గుర్తించారు. శనివారం ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు ఇద్దరూ రాష్ట్రంలోని మెయిన్‌పురి జిల్లాలోని భికాన్‌పుర్ గ్రామానికి చెందినవారు. వారు సమీపంలోని ధోల్‌పురా గ్రామానికి కూలీ పనుల కోసం వెళ్లారు. రీల్స్​ కోసం పట్టాల దగ్గర వీడియోల చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరూ చెవుల్లో ఇయర్​ఫోన్స్​ పెట్టుకున్నారు. దీంతో వారికి రైలు వస్తున్న శబ్దం వినపడలేదు. అనంతరం వారిద్దరిని రాజధాని ఎక్స్​ప్రెస్​ ఢీకొట్టింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. పోస్ట్​మార్టం పరీక్షల నిమిత్తం మృతదేహలను ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

పెళ్లి కోసం ఏకంగా విమానాన్నే బుక్‌ చేసిన జంట... వీడియో వైరల్​

సాయిబాబా పాదాలు మొక్కుతూ గుండెపోటుతో భక్తుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.