ETV Bharat / bharat

Secunderabad Gold Theft Case update : సికింద్రాబాద్ గోల్డ్ చోరీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

author img

By

Published : Jun 6, 2023, 11:54 AM IST

Updated : Jun 6, 2023, 1:24 PM IST

gold chori
gold chori

Two more arrested in Secunderabad Gold Theft case : ఐటీ అధికారుల పేరుతో బంగారం చోరీ చేసిన కేసులో.. మరో ఇద్దరు దుండగులు అరెస్ట్​ అయ్యారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి నుంచి 1,100 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు అరెస్టు కాగా.. మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Secunderabad Gold Robbery Case : ఈ నెల 27న సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలోని బంగారం దుకాణంలో చోరీ కేసును పోలీసులు చేధించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన హైదరాబాద్​ టాస్క్​ఫోర్స్ పోలీసులు.. మంగళవారం పుణెలో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను చేపట్టాయి. వీరి వద్ద నుంచి ఇప్పటివరకు 1,100 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Secunderabad Gold Theft Case Updates : సికింద్రాబాద్​లోని బంగారం దుకాణంలో ఐటీ అధికారుల పేరుతో సినీ ఫక్కీలో ఓ ముఠా భారీ చోరీకి పాల్పడింది. మే 27వ తేదీన ప్యాట్ మార్కెట్​లోని బాలాజీ జ్యువెల్లరీ షాపులో ఐటీ అధికారులమని అక్కడ ఉన్న వారిని నమ్మించి.. ఐదుగురు వ్యక్తులు 1700 గ్రాముల బంగారంతో ఉడాయించారు.

షాపు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ టాస్క్​ఫోర్స్​ పోలీసులు, ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో 36 గంటల్లోనే ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. దుండగులు చోరీ చేసిన అనంతరం.. జేబీఎస్ వరకు ఆటోలో వెళ్లి.. ఆ తర్వాత కేపీహెచ్​బీ బస్​ స్టాండ్​కు వెళ్లారు. అక్కడి నుంచి మహారాష్ట్ర బస్సు ఎక్కి చేక్కేశారు. ఈ సమాచారం ఆధారంగా బస్సు రూట్​ ప్రకారం.. మూడు బృందాలు అక్కడకు చేరుకున్నాయి. మహారాష్ట్రలో లోకల్ పోలీసుల సహాయంతో నలుగురిని అరెస్టు చేసి.. సికింద్రాబాద్​ టాస్క్​ఫోర్స్ కార్యాలయానికి తీసుకువచ్చారు.

Secunderabad Gold Theft Case : ఆ నలుగురి నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకొని.. మిగిలిన వారి కోసం వేట ప్రారంభించారు. దుండగులు రెండు బృందాలుగా విడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పుణెకు వెళ్లిన టాస్క్​ఫోర్స్​ బృందం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అంతకు ముందు పోలీసులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. చోరీకి రెక్కీ నిర్వహించడానికి ఈ నెల 24 నుంచి 27 వరకు ప్యాట్నీలోని దిల్లీ లాడ్జిలో నిందితులు బస చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎంతో తెలివిగా వ్యవహరించిన దుండగులు : వీరు ఒకరికి ఒకరు తెలియకుండా లాడ్జిలో రెండు బృందాలుగా ఏర్పడి బస చేశారు. ఆఖరికి మేనేజర్​కు అనుమానం రాకుండా వ్యవహరించారు. ఆధార్ కార్డులు అడిగితే.. మొదట తన వాట్సాప్ నంబరుకు పంపించారు. ఆ తర్వాత డిలీట్​ ఫర్​ ఎవ్రీ వన్ తో నిందింతులు డిలీట్ చేసేశారని పోలీసులు తెలిపారు. మూడు రోజుల తర్వాత కూడా అది ఎలా సాధ్యమయిందో అర్థం కాని పరిస్థితి. లాడ్జి డబ్బులను కూడా ఫోన్​పే చేయకుండా చేతికే ఇచ్చారని యజమాని చెప్పారు.

ఇవీ చదవండి :

Last Updated :Jun 6, 2023, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.