ETV Bharat / bharat

'ట్రంప్ గోడ' దూకబోయి భారతీయుడు మృతి.. ఇద్దరికి గాయాలు

author img

By

Published : Dec 23, 2022, 5:42 PM IST

Updated : Dec 23, 2022, 5:49 PM IST

అమెరికా- మెక్సికో సరిహద్దు గోడ వద్ద విషాదకర ఘటన జరిగింది. 'ట్రంప్ గోడ'ను దూకబోయి అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ భారతీయ కుటుంబంలో ఒకరు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు.

Trump wall became wall of death, Gujarati family break down after illegal entry Mexico to US
ట్రంప్ గోడ దాటబోయి మృతి చెందిన వ్యక్తి

అమెరికా- మెక్సికో సరిహద్దు గోడ వద్ద విషాదకర ఘటన జరిగింది. మెక్సికో వెళ్లిన గుజరాతీ కుటుంబం ట్రంప్ గోడ దూకి అక్రమంగా అమెరికాలో ప్రవేశించేందుకు యత్నించగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అతడి భార్య, మూడేళ్ల కుమార్తె గాయాలపాలయ్యారు. ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

గుజరాత్ నుంచి ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు విదేశాలకు వెళుతుంటారు. అక్కడి నుంచి అక్రమంగా ఇతర దేశాలలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇటీవల గుజరాత్​ గాంధీనగర్​కు చెందిన కలోల్​ కుటుంబం కూడా ఇదే రీతిలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిందేందుకు ప్రయత్నించింది. అయితే దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 30 అడుగుల ఎత్తులో ఉన్న ట్రంప్ గోడను దూకబోయి.. కుటుంబ యజమాని బ్రిజేష్ కుమార్ మృతి చెందాడు. అతని భార్య, మూడు సంవత్సరాల వయసున్న కుమార్తె గాయపడ్డారు.

ఈ విషయం గురించి గాంధీనగర్ కలెక్టర్ భరత్​ జోషి మాట్లాడుతూ.. "బ్రిజేష్ కుమార్ తన కుటుంబంతో దేశం విడిచి వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరంతా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో బ్రిజేష్ మృతి చెందాడు. అతని కుటుంబం గాయాలపాలైంది. ఓ ఏజెంట్ ద్వారా అమెరికా వెళ్లిన ఈ కుటుంబం ఉత్తర్​ప్రదేశ్​కు చెందింది. బ్రిజేష్ గుజరాత్ గాంధీనగర్​కు చెందిన కలోల్ జీఐడీసీలో పనిచేస్తున్నాడు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది" అని ఆయన అన్నారు.
మెక్సికో నుంచి శరణార్థుల రాకను నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ సరిహద్దులో భారీ గోడను నిర్మించారు. దానినే ట్రంప్​ గోడగా పిలుస్తుంటారు.

Last Updated :Dec 23, 2022, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.