ETV Bharat / bharat

రూ.2.5లక్షలు విలువైన టమాటాలు చోరీ.. మహిళా రైతు కన్నీరు

author img

By

Published : Jul 6, 2023, 1:36 PM IST

Updated : Jul 6, 2023, 3:04 PM IST

Tomato Stolen In Karnataka : టమాటా రైతులకు దొంగల భయం పుట్టుకుంది. తాజాగా కర్ణాటకలో ఓ మహిళా రైతు పొలంలో నుంచి రూ. 2.5 లక్షల విలువైన పంటను దొంగలు అపహరించారు. దీంతో మహిళా రైతు కన్నీటిపర్యంతమైంది.

Tomato Stolen In Karnataka
చోరీకి గురైన టమాటా పంట

Tomato Stolen In Karnataka : కర్ణాటకలో ఓ మహిళా రైతు పొలంలో 2.5 లక్షలు విలువైన టమాటా పంట చోరీకి గురైంది. 50 నుంచి 60 బస్తాల టమాటాలతో దొంగలు పరారయ్యారు. టమాటాలకు మార్కెట్​లో మంచి డిమాండ్ ఉండడం వల్ల.. పంట కోసి బెంగళూరుకు తరలిద్దామనుకున్న క్రమంలో చోరీ జరిగిందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి జరిగింది ఈ ఘటనపై.. హళేబీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆశలు ఆవిరి..
ధరణి అనే మహిళ కర్ణాటకలోని హసన్ జిల్లా సోమనహళ్లి గ్రామానికి చెందిన వారు. ఆమె టమాటా రైతు. ఈ సంవత్సరం ధరణి.. తమ కుటుంబ సభ్యులతో కలిసి రెండకరాలలో టమాటా పంట సాగు చేశారు. ఈసారి పంట దిగుబడి బాగా వచ్చిందని, మార్కెట్​లో కూడా టమాటాలకు డిమాండ్ ఉండడం వల్ల మంచి లాభాలు వస్తాయని వారు ఆశించారు. బెంగళూరు మార్కెట్​లో కిలో టమాటా ధర రూ. 120 పలుకుతున్న క్రమంలో.. పంట కోసి మార్కెట్​కు పంపుదామని అనుకునేలోపు ఇలా జరిగింది. దీంతో మహిళా రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

  • Karnataka | Farmer alleges tomatoes worth Rs 2.5 lakhs were stolen from her farm in the Hassan district on the night of July 4.

    A woman farmer, Dharani who grew tomatoes on 2 acres of land said that they were planning to cut the crop and transport it to market as the price… pic.twitter.com/fTxcZIlcTr

    — ANI (@ANI) July 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" మాకు గతంలో చిక్కుడు పంటలో నష్టం వచ్చింది. దీంతో అప్పులు చేసి మరీ టమాటా సాగు చేశాము. ఈసారి పంట దిగుబడి కూడా బాగా వచ్చింది. దానికి తోడు మార్కెట్​లో టమాటా మంచి ధర పలుకుతోంది. ఇలాంటి సమయంలో దొంగలు పంటను దోచుకున్నారు. సుమారు 50 - 60 బస్తాల టమామాలు ఎత్తుకెళ్లారు. మిగిలిన పంటను కూడా ధ్వంసం చేశారు"

- ధరణి, మహిళా రైతు

టమామా పంట దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్​కు ఫిర్యాదు రావడం ఇదే మొదటిసారి అని హళేబీడు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపైన సరైన దర్యాప్తు జరిపించి.. పంటకు నష్టపరిహారం చెల్లించాలని ధరణి కుమారుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కాగా గత కొద్ది రోజులుగా కర్ణాటకలో టమాటాల రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు మార్కెట్​లో కిలో టమాటా వంద రూపాయలు దాటేసింది. మార్చ్​, ఏప్రిల్​లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంట దిగుబడి తగ్గిపోయింది. ఈ కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగి వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

దొంగల భయంతో సీసీ కెమెరా ఏర్పాటు..

దేశంలో అనేక నగరాల్లో టమాటాల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో ఓ కూరగాయల వ్యాపారి మార్కెట్​ ఆవరణలో బుట్టలో కెమెరా ఉంచి టమాటాలు విక్రయించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వింత సంఘటన కర్ణాటక హవేరిలో జరిగింది. ఈ వీడియో చూడాలంటే కింది లింక్​ పైన క్లిక్​ చేయండి..

Last Updated : Jul 6, 2023, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.