ETV Bharat / bharat

కల్తీ మద్యం కలకలం.. మూడు రోజుల్లో 39 మంది మృతి

author img

By

Published : Nov 6, 2021, 8:34 PM IST

బిహార్​లో కల్తీ మద్యం సేవించిన ఘటనలో 72 గంటల వ్యవధిలో మృతుల సంఖ్య 39కి చేరినట్లు అధికారులు తెలిపారు. మరికొంతమంది కంటిచూపు మందగించినట్లు పేర్కొన్నారు.

poisinous liquor
కల్తీమద్యం కలకలం

బిహార్​లో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. మొత్తం మరణాలు.. మూడు రోజుల వ్యవధిలోనే జరిగినట్టు అధికారులు తెలిపారు. మరికొంత మంది కంటిచూపు మందగించినట్లు పేర్కొన్నారు.

బిహార్​లోని పశ్చిమ చంపారన్, గోపాల్​గంజ్ జిల్లాల్లో రెండు రోజుల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు.

పశ్చిమ చంపారన్ జిల్లాలోని తెల్హువా గ్రామంలో గురువారం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, గోపాల్​గంజ్​ జిల్లాలోని కుషాహర్, మహ్మద్‌పుర్​ గ్రామాల్లోనూ అనుమానాస్పద మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం మరో ఆరుగురు మరణించగా.. జిల్లాలో మృతుల సంఖ్య 16కు పెరిగింది.

ఇదీ చూడండి: 'భాజపా, ఆరెస్సెస్​లతో జాగ్రత్త.. ఆ విషయంలో వెనకాడరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.