దేవాలయాలు కట్టిస్తున్న ముస్లిం.. ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలని ఆకాంక్ష

author img

By

Published : Sep 13, 2022, 11:03 AM IST

TEMPLE WAS BUILT BY A MUSLIM MAN

హిందూ-ముస్లింలు చివరి వరకు సోదరభావంతో కలిసి ఉండడమే ఆయన కోరిక! అందుకే పలు దేవాలయాలను నిర్మించి మతసామరస్యాన్ని చాటుతున్నారు. ఆయనే కర్ణాటకకు చెందిన సయ్యద్ ఉదత్ సకఫ్. తాజాగా మరో మందిరాన్ని నిర్మించారు.

కర్ణాటకలోని రామనగరలో మతసామరస్యాన్ని చాటుతున్నారు సయ్యద్ సదత్ ఉల్లా సకఫ్ అనే వ్యక్తి. చన్నపట్టణకు చెందిన ఆయన.. తన సొంత డబ్బుతో బసవేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఆలయ ఆవరణలోనే మసీదును నిర్మించారు. హిందూ- ముస్లింలు సోదర భావంతో మెలగాలని సయ్యద్​ కోరుతున్నారు.

TEMPLE WAS BUILT BY A MUSLIM MAN
.
స్థానిక ముస్లిం నేత అయిన సయ్యద్ అన్ని మతాలను గౌరవిస్తున్నారు. ఆయన​కు హిందువులంటే చాలా అభిమానం. ప్రజలంతా ఇతర మతాల పట్ల సామరస్యంతో ఉండాలనే ఉద్దేశంతో 2010లోనే వీరభద్ర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని స్వర్గీయ సిద్దగంగ శ్రీ డాక్టర్ శివకుమార స్వామీజీ ప్రారంభించారు. ఇప్పుడు బసవేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నారు సయ్యద్. ఆలయ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వీరభద్ర ఆలయం మాదిరిగానే బసవేశ్వర మందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తానని చెబుతున్నారు.
TEMPLE WAS BUILT BY A MUSLIM MAN
.

కాగా, చన్నపట్టణంలో ప్రజలు కలిసిమెలిసి పండగలు జరుపుకొంటున్నారు. హిందూ దేవాలయంలో జరిగే జాతరకు.. ముస్లింలు తరలిరావడం ీ గ్రామం ప్రత్యేకత. అదేవిధంగా ముస్లింలు నిర్వహించే గంధ మహోత్సవానికి హిందువులు వెళ్తారు. కాబట్టి, ఈ గ్రామాన్ని హిందూ-ముస్లిం ఆధ్యాత్మికత గ్రామంగా పిలుస్తారు. అంతే కాకుండా సయ్యద్.. గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినవారికి విరాళాలు ఇస్తారు. హిందువులు- ముస్లింలు చివరి వరకు అన్నదమ్ముల్లా ఉండాలన్నదే తన కోరికని సయ్యద్ చెబుతున్నారు.

TEMPLE WAS BUILT BY A MUSLIM MAN
దేవాలయ పనులను పర్యవేక్షిస్తున్న సయ్యద్

ఇవీ చదవండి: నిక్కరు పోస్టుపై దుమారం.. కాంగ్రెస్​పై భాజపా, ఆర్ఎస్ఎస్ ఎదురుదాడి

గోగ్రా- హాట్​స్ప్రింగ్స్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి.. అక్కడ మాత్రం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.