ETV Bharat / bharat

Telangana Govt Letter to KRMB Chairman : 'గతేడాది ఏపీ ఎక్కువగా వాడుకున్న జలాలను ఈ ఏడాది జమ చేయాలి'

author img

By

Published : Aug 11, 2023, 9:52 PM IST

Telangana Govt Letter to KRMB Chairman : ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం గతేడాది ఎక్కువగా వాడుకున్న జలాలను ఈ సంవత్సరం జమ చేయాలని కేఆర్​ఎంబీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్​కు లేఖ రాశారు.

KRMB Chairman Respond on Water Sharing
Irrigation Department ENC Muralidhar letter to KRMB Chairman

Telangana Govt Letter to KRMB Chairman : గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వినియోగించుకున్న జలాలను ఈ ఏడాదికి జమ చేయాలని.. తదుపరి త్రిసభ్య కమిటీ సమావేశంలో వాటిని పరిగణలోకి తీసుకొని కేటాయింపులు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ రాష్ట్రం కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్​కు లేఖ రాశారు. ఏపీ ప్రతి ఏడాది కృష్ణా జలాలను వాటాకు మించి వాడుకుంటోందని.. 2022-23లో చెరి సగం నిష్పత్తిన చూస్తే 205 టీఎంసీలను.. 34:66 నిష్పత్తిలో 51 టీఎంసీలను ఎక్కువగా తీసుకొందని లేఖలో పేర్కొన్నారు. సమర్థంగా నీటిని వాడుకొని తదుపరి అవసరాల కోసం తెలంగాణ తన వాటాలోని నీటిని ఉమ్మడి జలాశయాల్లో నిల్వ చేసినట్లు తెలిపారు.

ENC Muralidhar letter to KRMB Chairman : ప్రత్యేకంగా ఆఫ్​లైన్ రిజర్వాయర్లు లేనందున గత ఏడాది 18.7 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వ చేసుకున్నామని.. 2023-24 తొలి సీజన్​లో తాగు, సాగు నీటి అవసరాలకు వాటిని వినియోగించుకోవాలన్నది తమ ప్రణాళిక అని వివరించారు. ఇదే విషయాన్ని గతంలోనే బోర్డుకు కూడా నివేదించినట్లు తెలిపారు. క్యారీ ఓవర్​ను ప్రస్తుత ఏడాది రాష్ట్ర వాటాగా కూడా పరిగణలోకి తీసుకోరాదని ఈఎన్సీ కోరారు. ట్రైబ్యునల్ ముందు నివేదించిన ప్రకారం సాగర్ కింద ఏపీకి ఏడాది తాగు నీటి అవసరాలకు కేవలం 2.84 టీఎంసీలు మాత్రమే అవసరమని.. కానీ, 5 టీఎంసీలు ఇవ్వాలని కోరినట్లు లేఖలో గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో చెరిసగం వాటా కావాలన్న తమ డిమాండ్ నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖను నివేదించాలని 17వ బోర్డు సమావేశంలో నిర్ణయించారని.. నివేదనకు సంబంధించిన ప్రతిని తమకు ఇవ్వాలని తెలంగాణ కోరింది. 2023-24 సంవత్సరానికి నీటి కేటాయింపులను ఖరారు చేసే సమయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది.

KRMB Meeting : దిల్లీకి చేరిన కృష్ణా జలాల వాటాల పంచాయితీ

Telangana Urges to KRMB to Stop Extra Water AP : గతంలో బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలలో చిన్న నీటి వనరులను మినహాయించి మిగిలిన నీటిని 66:34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వినియోగించుకొంటున్నాయి. ఆ జలాలను వచ్చే నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో కేటాయింపులు ఉండాలని రాష్ట్రం కోరింది. ఈ అంశంపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆ విషయంలో నిర్ణయం కోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని కేఆర్​ఎంబీ ఛైర్మన్‌ ప్రకటించారు. కేంద్రం నుంచి నిర్ణయం వచ్చే వరకు నీటి విడుదలపై ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకొంటుందని తెలిపారు. ఈ కమిటీలో బోర్డు సభ్యుడితో పాటు రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు సభ్యులుగా ఉన్నారు. 2022-23వ నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో నీటి వినియోగం ఉండాలని తెలంగాణ ప్రతిపాదించింది. దీనిపై తీవ్రస్థాయిలో ఇరు రాష్ట్రాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్​కి 512, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకొనేలా 2015లో అవగాహన కుదిరింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అదే పద్ధతి కొనసాగుతోంది.

Rajathkumar on Krishna River Water Allocation : 'జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాల్సిందే'

KRMB Meeting Update : వర్చువల్​గా కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం.. హాజరుకాని తెలంగాణ ఈఎన్​సీ

Telangana Govt letter to KRMB : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.