ETV Bharat / bharat

'పాఠశాలలు తెరిచినప్పుడు కోర్టులు ఎందుకు తెరవరు?'

author img

By

Published : Sep 5, 2021, 9:31 AM IST

పాఠశాలలు తెరిచినా కోర్టుల్లో విచారణకు విముఖత ఎందుకు అంటూ ఓ విద్యార్థిని రాసిన లేఖను సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పిల్‌గా పరిగణించారు. బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం నిర్వహించిన సీజేఐ సన్మాన కార్యక్రమంలో జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

student letter to cji
విద్యార్థిని లేఖతో సుప్రీంకోర్టులో పిల్​

ఓ విద్యార్థిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా (పిల్‌) మారింది. పాఠశాలలు తెరిచినా కోర్టుల్లో విచారణకు విముఖత ఎందుకు అంటూ ఓ విద్యార్థిని రాసిన లేఖను సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పిల్‌గా పరిగణించారు.

బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం నిర్వహించిన సీజేఐ సన్మాన కార్యక్రమంలో జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. "పాఠశాలలు తెరిచినప్పుడు కోర్టులు ఎందుకు తెరవరు. భౌతిక పద్ధతిలో పాఠశాలలు తెరిచారు. కానీ కోర్టులు ఇప్పటికీ ఆ పద్ధతికి సుముఖత చూపడం లేదు ఎందుకు" అని ఆ విద్యార్థిని సీజేఐకు లేఖ రాశారని ఆయన తెలిపారు. ఆమె లేఖనే సీజేఐ పిల్‌గా పరిగణించారని, త్వరలోనే ఆ పిటిషన్‌ విచారణ కొనసాగుతుందని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి:'మా మూలాలు అక్కడి నుంచే మొదలయ్యాయి'

'మూడేళ్లలోపు తీర్పు రాకపోతే న్యాయాన్ని తిరస్కరించినట్లే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.