ETV Bharat / bharat

'అప్పటి వరకు ఒకే దేశం- ఒకే రేషన్ అమలు కావాల్సిందే'

author img

By

Published : Jun 29, 2021, 11:51 AM IST

ఒకే దేశం-ఒకే రేషన్​ పథకాన్ని జులై 31 వరకు అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వలస కార్మికుల కోసం సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

sc
సుప్రీంకోర్టు

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే దేశం- ఒకే రేషన్ పథకాన్ని జులై 31 వరకు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణిగేంత వరకు వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్​ షాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

"వలస కార్మికుల కోసం సామూహిక వంటశాలలను ఏర్పాటు చేయాలి. అసంఘటిత రంగాల్లోని కార్మికుల రిజిస్ట్రేషన్​ కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్​ సెంటర్​(ఎన్​ఐసీ) సాయంతో జులై 31లోపు కేంద్రం ఓ పోర్టల్​ను రూపొందించాలి."

-- సుప్రీంకోర్టు ధర్మాసనం

వలస కార్మికులకు కేంద్రం ఎలాంటి సంక్షేమ పథకాలు అందిస్తుందో తెలపాలని కోరుతూ అంజలి భరద్వాజ్, హర్ష మందార్, జగ్దీప్ ఛోకర్ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీం ధర్మాసనం విచారించింది.

ఇదీ చదవండి : నిర్లక్ష్యంతోనే మూడోదశ ప్రమాదం.. జాగ్రత్తలేవి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.