ETV Bharat / bharat

నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​గా సుమన్​ బేరీ

author img

By

Published : May 1, 2022, 3:33 PM IST

NITI Aayog Vice Chairman: నీతి ఆయోగ్​ ఉపాధ్యక్షుడిగా సుమన్​ బేరీ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. మాజీ వీసీ రాజీవ్ ​కుమార్​ స్థానంలో బేరీకి బాధ్యతలు అప్పగించింది కేంద్రం. మరోవైపు సీనియర్​ ఐఏఎఫ్​ అధికారి వినయ్​ క్వాత్ర నూతన విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు అందుకున్నారు.

suman bery
నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​గా సుమన్​ బేరీ

NITI Aayog Vice Chairman: నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​గా రాజీవ్​ కుమార్​ పదవి నుంచి వైదొలగిన నేపథ్యంలో కొత్త వీసీగా సుమన్​ బేరీ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. కేంద్రం తనపై నమ్మకముంచి ఈ బాధ్యతలను అప్పగించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. భారత ఆర్థిక వృద్ధిలో నీతి ఆయోగ్​ తనదైన పాత్ర పోషించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

suman bery
బాధ్యతలు చేపడుతున్న సుమన్​ బేరీ

వీసీగా బేరీ ఎంపికకు ముందు.. ఆయన నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ అప్లైడ్​ ఎకనామిక్​ రీసర్చ్​కు (ఎన్​సీఏఈఆర్) డైరెక్టర్​గా సేవలు అందించారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారుల మండలి, స్టాటిస్టికల్​ కమిషన్​, మానిటరీ పాలసీపై రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా సాంకేతిక సలహాదారుల కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ప్రపంచ బ్యాంక్​కు కూడా బెరీ సేవలు అందించారు.

suman bery
నూతన విదేశాంగ కార్యదర్శి వినయ్​ క్వాత్ర

Foreign Secretary of India: సీనియర్​ ఐఎఫ్ఎస్​ అధికారి వినయ్​ క్వాత్ర నూతన విదేశాంగ కార్యదర్శిగా ఆదివారం బాధ్యతలు అందుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్​ బాగ్చి వెల్లడించారు. జనవరి 2020 నుంచి ఇప్పటివరకు నేపాల్​లో భారత రాయబారిగా క్వాత్ర సేవలు అందించారు. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న హర్ష్​ వర్ధన్​ శ్రింగ్లా స్థానాన్ని వినయ్​ క్వాత్ర భర్తీ చేశారు.

ఇదీ చూడండి : ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేసిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.