డ్రగ్స్​ మత్తులో విద్యార్థుల వీరంగం- నడిరోడ్డుపై ఫైట్!

author img

By

Published : Jan 12, 2022, 1:51 PM IST

Students create chaos in udupi

Students drugs fight: డ్రగ్స్​ మత్తులో నడిరోడ్డుపై విద్యార్థులు వీరంగం సృష్టించారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను బెదిరించారు. ఈ ఘటన కర్ణాటక ఉడుపి జిల్లాలో జరిగింది.

డ్రగ్స్​ మత్తులో విద్యార్థుల వీరంగం

Students drugs fight: చదువుకుని రోగుల బాగోగులు చూసుకోవాల్సిన విద్యార్థులు డ్రగ్స్​కు బానిసయ్యారు. వారు ప్రయాణిస్తున్న బైక్​లో పెట్రోల్ అయిపోవడంపై నడిరోడ్డుపై గొడవ పడ్డారు. శాంతింపజేసేందుకు ప్రయత్నించిన పోలీసులు, స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన కర్ణాటక ఉడుపి జిల్లాలో జరిగింది. ​

ఏమైందంటే..?

ఓ అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒకే బైక్​పై ప్రయాణిస్తున్నారు. పాడుబిద్రి పట్టణంలోకి రాగానే బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. పెట్రోల్​ అయిపోయిన కారణంగా బైక్ ఆగిపోయిందని గ్రహించిన యువత ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పిడిగిద్దులు కురిపించుకున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతోనూ యువత వాగ్వాదానికి దిగారు. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీస్​ స్టేషన్​కు వెళ్లడానికి నిరాకరించారు. చేసేదేమీ లేక స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. విద్యార్థులు తమిళనాడుకు చెందినవారుగా గుర్తించారు. ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు చెప్పారు. ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

ఇదీ చదవండి: ఉమ్మువేసి రోటీలు తయారీ- యువకుడి అరెస్ట్​

ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్లు వాడండి కాదంటే.. నా చావుకు అనుమతించండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.