ETV Bharat / bharat

బిజినెస్​మెన్​ భార్యలకు వల.. రూ.200 కోట్లకు టోకరా!

author img

By

Published : Sep 1, 2021, 5:33 PM IST

పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడటం సినిమాల్లో చూసుంటారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి(conman Sukesh Chandrasekhar) దానిని బాగా వంటపట్టించుకున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడ్డాడు. ఇద్దరు బిజినెస్​మెన్ భార్యలకు వల వేసి ఏడాదిలో ఏకంగా రూ.200 కోట్లకు టోకరా వేశాడు. తన బాధితుల్లో ఓ ప్రముఖ హీరోయిన్ సైతం ఉన్నట్లు తెలిసింది.

conman Sukesh Chandrasekhar
సుకేశ్​ చంద్రశేఖర్ దోపిడీ కేసు

సినీ ఫక్కీలో ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినీ నటులే లక్ష్యంగా ఓ వ్యక్తి కోట్ల రూపాయలు దండుకున్నాడు. పోలీసులు అరెస్ట్​ చేసి జైలుకు పంపితే.. అక్కడి నుంచీ తన పనితనాన్ని చూపించాడు. అతనే.. చెన్నైకి చెందిన సుకేశ్​ చంద్రశేఖర్(conman Sukesh Chandrasekhar)​. కొన్ని సంవత్సరాలుగా.. పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు.

రూ.200 కోట్లు..

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్​ సింగ్​, శివిందర్​ సింగ్​లకు(former promoters of Ranbaxy, Malvinder Singh and Shivinder Singh) బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్​ చంద్రశేఖర్​. శివిందర్​ సింగ్​ భార్య అదితి సింగ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్​ చేసింది దిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చారు.

"ఆగస్టు 7న దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగంలో ఫిర్యాదు చేశారు అదితి సింగ్​. 2020, జూన్​లో తనకు ఓ కాల్​ వచ్చిందని, కేంద్ర న్యాయశాఖలో సీనియర్​ అధికారిగా పరిచయం చేసుకుని, తన భర్తకు బెయిల్​ ఇప్పిస్తానని చెప్పినట్లు ఫిర్యాదులో అదితి పేర్కొన్నారు."

-ఆర్​కే సింగ్​, ఈఓడబ్ల్యూ అదనపు కమిషనర్​.

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్ల భార్యల నుంచి తీసుకున్న రూ.200 కోట్లతో చెన్నైలో ఓ ఖరీదైన బంగ్లా కొన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ ఇంటిని లగ్జరీ ఫర్నీచర్​తో అలంకరించినట్లు తెలిసింది. అలాగే.. మెర్సిడేస్​ బెంజ్​ 300 ఎస్​ఎల్​ఆర్​ వంటి 16 ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ఇటీవల దాడులు జరిపి.. బంగ్లాతో పాటు రూ.20 కోట్ల విలువైన వస్తువులను సీజ్​ చేసింది.

మోసపోయిన సాహో నటి..

రూ.200 కోట్ల దోపిడి కేసులో చంద్రశేఖర్​ సన్నిహితుడు లీనా మరియా పాల్​ సహా.. బాలీవుడ్​ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండేజ్(sukesh chandrasekhar jacqueline)​ను ఈడీ ఇటీవల ప్రశ్నించింది. ఈ విచారణలో జాక్వెలిన్​ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది.

తిహాడ్​ జైలు నుంచే కాలర్​ ఐడీ స్పూఫింగ్​ ద్వారా జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​ను సుకేశ్​ చంద్రశేఖర్​(sukesh chandrasekhar and jacqueline) సంప్రదించినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ వర్గాలు తెలిపాయి. తన గుర్తింపును దాచి పెట్టి, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు. అతన్ని జాక్వెలిన్​ నమ్మటం ప్రారంభించిన క్రమంలో.. ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని చెప్పారు. సుకేశ్​కు సంబంధించిన 20కిపైగా కాల్​ రికార్డులు ఈడీ దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాటి ద్వారా జాక్వెలిన్​ను మోసగించిన వివరాలను రాబట్టనున్నట్లు చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.

రూ.200 కోట్ల దోపిడీ కేసులో దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ) విచారణ కొనసాగిస్తోంది. సుకేశ్​ చంద్రశేఖర్​, లీనా పాల్​లపై దేశవ్యాప్తంగా 23 చీటింగ్​ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి: అంతులేని కథగా జైళ్లలో మానవ హక్కుల హననం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.