కొంపముంచిన పిల్లాడు.. తండ్రి ఫోన్​లో ఆన్​లైన్ గేమ్.. రూ.39 లక్షలు గోవింద!

author img

By

Published : Jun 23, 2022, 10:41 AM IST

son-plays-online-

ఇటీవల కాలంలో చాలా పిల్లలు తమ తల్లిదండ్రుల ఫోన్లలో గేమ్స్​ ఆడి.. రూ.లక్షలు పోగట్టిన ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాత ఫోన్​లో ఫ్రీఫైర్​ గేమ్​ ఆడి మనవడు రూ.36 లక్షలు పోగొట్టిన ఘటన మరువకముందే తాజాగా మరో ఘటనలో రూ.39 లక్షలు మాయమయ్యాయి. 'బ్యాటిల్​గ్రౌండ్​' గేమ్​ ఆడిన ఓ పిల్లాడు తండ్రి ఖాతాలో లక్షల రూపాయలను మాయం చేశాడు.

ప్రస్తుత రోజుల్లో పిల్లలు చాలా స్పీడ్​గా ఉన్నారు. కనీసం మాటలు కూడా సరిగ్గా పలకలేని చిన్నారులు సైతం సెల్​ఫోన్​లతో ఒక ఆట ఆడేసుకుంటున్నారు. కొందరు పిల్లలు అయితే చేతికి మొబైల్​ ఇవ్వకపోతే నోట్లో ముద్ద కూడా పెట్టుకోనంతగా మారారు. ప్లేస్టోర్​లో పలు గేమ్​లను ఇన్​స్టాల్​ చేసి ఆడుకుంటూ.. ఫోన్​లో ఉన్న అన్ని ఫీచర్లను వాడేస్తున్నారు. అలాంటి ఓ చురుకైన పిల్లాడు తన తండ్రి మొబైల్​లో ఆన్​లైన్​ గేమ్​ ఆడి ఏకంగా రూ.39 లక్షలు పోగొట్టాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో జరిగింది ఈ ఘటన.

ఇదీ జరిగింది..
ఆగ్రాలోని తాజ్​నాగ్రికు చెందిన ఓ విశ్రాంత సైనికుడి కుమారుడు.. తన తండ్రి మొబైల్​ను తరూచూ వాడుతుండేవాడు. ఆన్​లైన్​ గేమ్స్​ ఇన్​స్టాల్​ చేసుకుని ఆడేవాడు. తాజాగా ఆ పిల్లాడు తన తండ్రి మొబైల్​లో 'బ్యాటిల్​ గ్రౌండ్​' అనే ఆన్​లైన్​ పెయిడ్​ గేమ్​ను ఇన్​స్టాల్​ చేశాడు. ఆ తర్వాత డబ్బులు చెల్లించే ఆప్షన్​ను ఆటోమోడ్​లో పెట్టేశాడు. పిల్లాడు చాలా సార్లు గేమ్​ ఆడాడు. ఆడిన ప్రతీసారి ఆటోమోడ్​లో డబ్బులు చెల్లింపు అయ్యేవి. అయితే కొన్ని రోజులకు పిల్లాడు తండ్రి తన బ్యాంకు ఖాతాలో డబ్బులు చెక్​ చేయడానికి వెళ్లగా... రూ.39 లక్షలు మాయమైనట్లు గమనించారు.

వెంటనే దీనిపై ఆగ్రా రేంజ్​ సైబర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి సింగపుర్​లోని క్రాఫ్టన్ ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీ ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు సైబర్​ పోలీసులు గుర్తించారు. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్రాంత సైనికుడి ఫిర్యాదు మేరకు క్రాఫ్టన్ కంపెనీపై మోసం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఆకాశ్​ సింగ్ తెలిపారు. ఈ సైబర్ క్రైమ్ కేసులో అన్ని రకాల ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవీ చదవండి: బాలుడిని కాటేసిన విషసర్పం.. క్షణాల్లోనే ఆ పాము మృతి!

'ప్లాసీ'కి ముందే ఆర్కాట్​లో బీజం.. భారతావనిలో ఆంగ్లేయుల రాజ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.