ETV Bharat / bharat

'నిందితుల జాబితాలో సోషల్‌మీడియాను ఎందుకు చేర్చట్లేదు?'

author img

By

Published : Jan 22, 2022, 7:18 AM IST

Social Media Crimes: ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ వీడియోలు చూసి కొందరు నేరాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్న నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికల్ని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చట్లేదని తమిళనాడు పోలీసులను మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Social Media Crimes
హైకోర్టు

Social Media Crimes: ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ వీడియోలు చూసి కొందరు నేరాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్న నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికల్ని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చట్లేదని తమిళనాడు పోలీసులను మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఓ యూట్యూబర్‌పై నమోదైన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ప్రశ్నను లేవనెత్తింది.

అసత్యాలతో వీడియోలు రూపొందిస్తున్నాడంటూ దురైమురుగన్‌ అనే యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. అతడికి బెయిల్‌ మంజురైంది. అయితే, నిందితుడి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు పోలీసులు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. టెక్నాలజీ దుర్వినియోగాన్ని ఏ మాత్రం అనుమతించబోమని, నిందితుడు దురైమురుగన్‌ యూట్యూబ్‌ ద్వారా ఎంత సంపాదించాడో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

Crimes Social Media: ఈ సందర్భంగా సోషల్‌మీడియా దుర్వినియోగంపై కోర్టు స్పందిస్తూ "కొంత మంది డబ్బు సంపాదన కోసం సోషల్‌మీడియాను దుర్వినియోగపరుస్తున్నారు. ఇంకొందరు గన్స్‌ ఎలా తయారు చేయాలో, దొంగతనాలు, మోసాలు ఎలా చేయాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటున్నారు. ఇలాంటి సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో సోషల్‌మీడియా వేదికల్ని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చట్లేదు?" అంటూ న్యాయస్థానం పోలీసులను ప్రశ్నించింది. యూట్యూబ్‌ దుర్వినియోగం కాకుండా విధివిధానాలు రూపొందించాలని తమిళనాడు ఏడీజీపీ, సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:CoWin Data Leak: కొవిన్ పోర్టల్ డేటా లీక్!.. కేంద్రం క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.