కరోనా తీవ్రత తెలుసుకునేందుకు మురుగు నీటి పరీక్షలు!

author img

By

Published : Aug 4, 2021, 11:04 PM IST

sewage samples collection covid, మహమ్మారి సామాజిక వ్యాప్తి

కరోనా వైరస్​ సామాజిక వ్యాప్తి తీవ్రతను తెలుసుకునే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షల ద్వారా కొత్త వేరియంట్లను గుర్తించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో.. వైరస్​ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు కేంద్రం పరిశోధన చేపట్టనున్నట్లు సమాచారం. మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇన్సాకాగ్​ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది.

ఈ పరీక్షల ద్వారా ప్రస్తుతం దేశంలో ఏవైనా కొత్త వేరియంట్ల​ వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మూడో దశ సహా భవిష్యత్తులో కరోనా తీవ్ర రూపం దాల్చకుండా కట్టడి చేసేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.

ముంబయి, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్​, దిల్లీ సహా ప్రధాన నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి : కేరళలో 22వేల కరోనా కేసులు- మిగతా రాష్ట్రాల్లో ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.