ETV Bharat / bharat

ఆగని చైనా దురాక్రమణలు.. అరుణాచల్​ప్రదేశ్​లో మరో గ్రామం!

author img

By

Published : Nov 18, 2021, 8:12 PM IST

అరుణాచ‌ల్​ప్రదేశ్‌లోని షి యోమి జిల్లాలో చైనా ఓ గ్రామం(China village in arunachal) నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌ ఉపగ్రహ ఛాయాచిత్రాలను విడుదల చేసింది. ఆ ప్రాంతంలో చైనా సుమారు 60 భవనాలు నిర్మించిన‌ట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇటీవ‌ల అరుణాచ‌ల్‌లో ఓ గ్రామం నిర్మించిన చైనా.. దానికి 93 కిలోమీట‌ర్ల దూరంలో తూర్పు వైపున ఈ కొత్త ఎన్‌క్లేవ్‌ను నిర్మించిన‌ట్లు తెలుస్తోంది.

China village in arunachal
అరుణాచల్​ ప్రదేశ్​లో చైనా గ్రామం

సరిహద్దుల్లో చైనా దురాక్రమణ పర్వం కొనసాగుతోంది. అరుణాచ‌ల్​ప్రదేశ్‌లోని షి యోమి జిల్లాలో ఓ గ్రామం నిర్మించినట్లు తెలుస్తోందని ఓ జాతీయ ఛానెల్‌ ఉపగ్రహ ఛాయాచిత్రాలను విడుదల చేసింది. ఆ ప్రాంతంలో చైనా సుమారు 60 భవనాలు నిర్మించిన‌ట్లు ఉపగ్రహ దృశ్యాల్లో స్పష్టమ‌వుతోంది. 2019నాటి ఉపగ్రహ దృశ్యాల్లో లేని ఆ గ్రామం(China village in arunachal).. ఏడాది త‌ర్వాత తీసిన చిత్రాల్లో ఉన్నట్లు గుర్తించారు.

93 కిలోమీటర్ల దూరంలో..

ఇటీవ‌ల అరుణాచ‌ల్‌లో ఓ గ్రామం(China village in arunachal) నిర్మించిన చైనా.. దానికి 93 కిలోమీట‌ర్ల దూరంలో తూర్పు వైపున ఈ కొత్త ఎన్‌క్లేవ్‌ను(China enclave in arunachal pradesh) నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ), అంతర్జాతీయ సరిహద్దు మధ్య ఉన్న భార‌త భూభాగంలో.. రెండో గ్రామం నిర్మించిన‌ట్లు భావిస్తున్నారు. అయితే కొత్తగా నిర్మించిన ఆ భవనాల్లో ఎవ‌రైనా ఉన్నారా? లేదా? అనే విష‌యం స్పష్టంగా తెలియ‌రావ‌డం లేదు. చైనా రెండో గ్రామం నిర్మించిన ప్రాంతం త‌మ‌దేనని భార‌త్ గ‌తంలో పేర్కొంది. కొత్త నిర్మాణం ఎల్​ఏసీకి ఉత్తరం వైపున ఉన్నట్లు భారత సైన్యం పేర్కొంది. అయితే.. కొన్ని దశాబ్దాల క్రితమే చైనా ఆ భూభాగాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతోందని సైనిక వర్గాలు తెలిపాయి.

కొత్తగా నాలుగు గ్రామాలు..

మరోవైపు భూటాన్‌ భూమిని కూడా చైనా(China occupied bhutan) కబ్జాచేయడం మొదలుపెట్టింది. ఈ తతంగం దాదాపు ఏడాది నుంచి జరుగుతోంది. దాదాపు 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో కొత్తగా నాలుగు గ్రామాలు వెలిసినట్లు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించే.. డెట్రెస్‌ఫా అనే ట్విటర్‌ హ్యాండిల్‌ పేర్కొంది. ఈ నిర్మాణాలు.. డోక్లాంకు సమీపంలో ఉన్నాయి. డోక్లాంలో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత.. ఈ నిర్మాణాలు జరిగినట్లు తెలుస్తోంది. 2020 మే నుంచి 2021 నవంబర్‌ మధ్యలో ఈ నిర్మాణాలు జరిగాయి. భారత్‌..భూటాన్‌ సైన్యానికి శిక్షణ ఇవ్వడం సహా విదేశీ వ్యవహారాల్లో మార్గదర్శకత్వం చేస్తున్న నేపథ్యంలో తాజా నిర్మాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.