ETV Bharat / bharat

సీడీఎస్​ బిపిన్‌ రావత్‌కు'సైకత' నివాళి

author img

By

Published : Dec 10, 2021, 4:31 AM IST

Sand Art on CDS General Bipin Rawat: హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌కు ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ నివాళి అర్పించారు. ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.

sand artist Sudarsan Pattnaik sand art
బిపిన్‌ రావత్‌ సైకత శిల్పం

త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌కు ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ నివాళి

CDS General Bipin Rawat News: హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌కు ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ నివాళి అర్పించారు. ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. బిపిన్‌ రావత్‌తో పాటు ఇదే ప్రమాదంలో మృతి చెందిన మధులిక రావత్‌, ఆర్మీ ఉన్నతాధికారుల ఆత్మకు శాంతి చేకూరాలని సుదర్శన్‌ పట్నాయక్‌ ఆకాంక్షించారు.

Cds general helicopter crash: తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో హెలికాప్టర్​ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.

ఇదీ చదవండి:Bipin Rawat: 'అగ్గిపెట్టె' సమాధానంతో ఆర్మీలో చేరిన రావత్​..!

Palam Air base: రావత్​ పార్థివదేహానికి మోదీ, ప్రముఖుల నివాళి

నేలరాలిన త్రిదళపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.