ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి

author img

By

Published : Jan 27, 2021, 12:05 PM IST

road accident occured in kerala thiruvananthapuram,five died
కారు-లారీ ఢీ.. ఐదుగురు మృతి

కేరళ తిరువనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

కేరళ తిరువనంతపురంలో కారు, లారీ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

జిల్లాలోని తోట్టక్కడ్ వద్ద వేగంగా వెళ్తున్న ఓ కారు, చేపల లారీని ఢీ కొట్టింది. ఈ క్రమంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరు ఆసుపత్రిలో చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులు కొల్లాం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

ఇదీ చదవండి:బంగాల్​లో టీఎంసీ నేత దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.