ETV Bharat / bharat

పెళ్లికి వెళ్తుండగా విషాదం.. నదిలో బోల్తా పడ్డ ట్రక్కు.. 12 మంది మృతి

author img

By

Published : Jun 28, 2023, 9:53 AM IST

Updated : Jun 28, 2023, 11:33 AM IST

Road Accident In Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో వేగంగా వెళ్తున్న ఓ మినీ ట్రక్కు నదిలో బోల్తా పడిన ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వీరంతా ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

road accident in madhya pradesh today
road accident in madhya pradesh today

Road Accident In Madhya Pradesh : పెళ్లికి వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవశాత్తు నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో బుధవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. దుర్సాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వెళ్తున్న మినీ ట్రక్కు బుహరా నదిలో బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్​, ఎస్​పీ ప్రదీప్ శర్మ సహా ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. వీరంతా ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

road accident in madhya pradesh today
నదిలో బోల్తా పడ్డ ట్రక్కు

ఇదీ జరిగింది
గ్వాలియర్​కు బిల్​హెటి గ్రామానికి చెందిన ప్రజలు.. టికంగఢ్​లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఓ మినీ ట్రక్కులో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బుహరా గ్రామంలోని వంతెన వద్దకు రాగానే అదుపుతప్పి నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 30 మంది వరకు గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో ట్రక్కులో 50 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు అధికారులు. వీరిలో ముగ్గురు చిన్నారులు కాగా.. ఓ యువకుడు, వృద్ధురాలు ఉన్నారు. వీరంతా వధువును తీసుకుని పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. దీంతో పెళ్లి జరగాల్సిన వారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

Road Accident In Madhya Pradesh
నదిలో బోల్తా పడ్డ ట్రక్కు

ప్రమాదంపై హోంమంత్రి విచారం
దతియా జిల్లాలో జరిగిన ప్రమాదంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులతో చర్చించి.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Road Accident In Madhya Pradesh
రోదిస్తున్న బంధువులు
Road Accident In Madhya Pradesh
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

కరెంట్ షాక్​ తగిలి నలుగురు మహిళలు మృతి
బిహార్​లో మంగళవారం పొలంలో కూలీ పని చేసేందుకు వచ్చిన నలుగురు మహిళలు కరెంట్ షాక్​తో మృతిచెందారు. వరి నాట్లు వేస్తుండగా 11వేల ఓల్టేజ్​ ఉన్న కరెంట్ తీగ తగలడం వల్ల నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వారు పనిలో నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Jun 28, 2023, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.