ETV Bharat / bharat

'టీకా బూస్టర్​ డోస్​పై ముమ్మర పరిశోధనలు'

author img

By

Published : Jun 15, 2021, 2:09 PM IST

కరోనా వ్యాక్సిన్ బూస్టర్​ డోసు అవసరమా? అన్న విషయంపై ప్రపంచ దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని ఎయిమ్స్ సీనియర్ వైద్యులు తెలిపారు. రెండు, మూడు నెలల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నారు. కేసులు తగ్గినా.. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

booster dose
టీకా మూడో డోసు

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. వ్యాక్సిన్ బూస్టర్​ డోసు(booster dose)పై చర్చలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన ఎయిమ్స్(AIIMS)​ సీనియర్ డాక్టర్.. టీకా మూడో డోసు అవసరమా? అన్న అంశంపై భారత్​, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.

"భారత్​లో టీకా కార్యక్రమం 5 నెలల క్రితం ప్రారంభమైంది. ప్రస్తతం.. ప్రజల ముందున్న ప్రశ్న బూస్టర్​ డోసు తీసుకోవాలా? వద్దా? ప్రస్తుతం మూడో డోసు అవసరం పై పరిశోధనలు జరుగుతున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుంది."

-- డాక్టర్. సంజీవ్ సిన్హా, ఎయిమ్స్ వైద్యులు

కేసులు తగ్గుతున్నా.. ప్రజలు కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు సిన్హా. అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలన్నారు.

ఇదీ చదవండి : 6-12 ఏళ్ల పిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.