ETV Bharat / bharat

అందుకు ఒప్పుకోలేదని మర్మాంగం కోసేశారు!

author img

By

Published : Jul 3, 2021, 12:52 PM IST

rapist cut off the private part sultanpur, attack on gangrape victim brother
అందుకు ఒప్పుకోలేదని మర్మాంగం కోసేశారు!

కక్షసాధింపు కోసం కొందరు దుండగులు ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో చోటుచేసుకుంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని సుల్తాన్​పుర్​ జిల్లా అర్జున్​పుర్​లో అమానవీయ ఘటన జరిగింది. తమపై కేసు పెట్టారన్న కారణంతో ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేశారు కొందరు దుండగులు. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లఖ్​నవూలోని ట్రోమా సెంటర్​లో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది..

ప్రతాప్​గఢ్​ జిల్లా ఆసపుర దేవసారా గ్రామానికి చెందిన ఓ యువతిపై 2019లో నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు.. ఈ కేసును వెనక్కు తీసుకోవాలని బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు. రాజీ పడకపోతే చంపేస్తాం అంటూ యువతి సోదరుడిని బెదిరించారు. కానీ ఆ బాధితుడు (యువతి సోదరుడు) అందుకు తిరస్కరించాడు. దీంతో ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులు అతనిపై కక్ష సాధించేందుకు సిద్ధమయ్యారు.

బాధితుడు గత జూన్ 26న అర్జున్​పుర్​లోని అతని అత్తవారి ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు.. పథకం ప్రకారం అతనిపై దాడి చేసి మర్మాంగాన్ని కోసేశారు. సమాచారం అందుకున్న అధికారులు బాధితుడిని లఖ్​నవూలోని ట్రోమా సెంటర్​కు తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలోని నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి : భర్త చేష్టలతో విసిగి.. మర్మాంగాన్ని కోసిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.