ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ జిల్లా అర్జున్పుర్లో అమానవీయ ఘటన జరిగింది. తమపై కేసు పెట్టారన్న కారణంతో ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేశారు కొందరు దుండగులు. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లఖ్నవూలోని ట్రోమా సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
ప్రతాప్గఢ్ జిల్లా ఆసపుర దేవసారా గ్రామానికి చెందిన ఓ యువతిపై 2019లో నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు.. ఈ కేసును వెనక్కు తీసుకోవాలని బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు. రాజీ పడకపోతే చంపేస్తాం అంటూ యువతి సోదరుడిని బెదిరించారు. కానీ ఆ బాధితుడు (యువతి సోదరుడు) అందుకు తిరస్కరించాడు. దీంతో ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులు అతనిపై కక్ష సాధించేందుకు సిద్ధమయ్యారు.
బాధితుడు గత జూన్ 26న అర్జున్పుర్లోని అతని అత్తవారి ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు.. పథకం ప్రకారం అతనిపై దాడి చేసి మర్మాంగాన్ని కోసేశారు. సమాచారం అందుకున్న అధికారులు బాధితుడిని లఖ్నవూలోని ట్రోమా సెంటర్కు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలోని నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి : భర్త చేష్టలతో విసిగి.. మర్మాంగాన్ని కోసిన భార్య