ETV Bharat / bharat

రామనామాల బ్యాంక్​- దేశవ్యాప్తంగా శాఖలు- అగ్నిప్రమాదం జరిగినా సేఫ్​గా రికార్డులు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 12:05 PM IST

Ram Naam Bank in Ajmer : అదొక బ్యాంక్​. కానీ అక్కడ ఎలాంటి నగదు లావాదేవీలు జరగవు. నగదుకు బదులుగా చేతులతో రాసిన రామనామాల కాపీలు మాత్రమే ఉంటాయి. ఈ వింత బ్యాంక్​ ఎక్కడ ఉంది? దాని విశేషాలు ఎంటో తెలుసుకుందాం రండి.

Ram Naam Bank in Ajmer
Ram Naam Bank in Ajmer

Ram Naam Bank in Ajmer : రాజస్థాన్​లోని అజ్​మేర్​లో ఓ వింత బ్యాంక్​ ఉంది. ఇందులో నగదు లావాదేవీలు జరపడానికి బదులుగా రామనామాలు సేకరిస్తారు. 1987 ఏప్రిల్​ 7న ప్రారంభమైన ఈ బ్యాంకుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 280 శాఖలు ఉండగా, మొత్తం 55వేల మంది ఖాతాదారులు ఉన్నారు. రాజస్థాన్​లోనే ఐదు ప్రాంతీయ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో ఖాతా తెరవగానే ఓ పాస్​బుక్​ను అందజేస్తారు. ఆ తర్వాత ఖాతాదారుడికి 84 లక్షల రామనామాలు రాసే పుస్తకాన్ని పోస్ట్​లో పంపిస్తారు. అవి తిరిగి వచ్చాక వాటిని పరిశీలించి ఖాతాలో జమచేస్తారు. ప్రతి పుస్తకంలో 25 వేల రామనామాలు రాసే వీలు ఉంటుంది. ఇలా 84 లక్షల రామనామాలు రాసేందుకు సుమారు 330 పుస్తకాలు అవసరమవుతాయి.

Ram Naam Bank in Ajmer
రామనామాలు రాసిన పుస్తకం

బ్యాంక్​లో ఉన్న 55 వేల ఖాతాదారుల్లో ఇప్పటివరకు 2వేల మంది 84 లక్షల రామనామాలు రాశారు. మరో 70 మంది 84 లక్షల రామానామాలను రెండు సార్లు రాశారు. ఇదే సమయంలో 10 మంది మూడు సార్లు 84 లక్షల రామానామాలను పూర్తి చేశారు. ఈ ఖాతాదారుల రికార్డులను రిజిస్ట్రర్లతో పాటు కంప్యూటర్లలో కూడా నమోదు చేస్తారు. ఖాతాదారుడి మరణానంతరం వారి వారసులు వచ్చినా రికార్డులు ఉంటాయని బ్యాంక్​ నిర్వాహకులు చెబుతున్నారు. బ్యాంక్​ రోజువారీ నిర్వహణ కోసం ఐదుగురు సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు.

Ram Naam Bank in Ajmer
రామ్​ నామ్​ బ్యాంక్ ఖాతా

"గీతా ప్రెస్​ డైరెక్టర్​ రామ్​ సుఖ్ దాస్ మహారాజ్​ ఆధ్వర్యంలో అజ్​మేర్​లో రామ్​ నామ్​ దాన్​ సంగ్రహ్​ బ్యాంక్ ప్రారంభమైంది. ​ఇందులో 55వేల మంది ఖాతాదారులు రామానామాలు రాస్తున్నారు. వారి రికార్డులను ఇక్కడే భద్రపరుస్తాము. 2012లో బ్యాంక్​లో షార్ట్ సర్క్యూట్​ తలెత్తి అగ్నిప్రమాదం జరిగింది. కానీ ఒక్క పుస్తకం కూడా కాలిపోలేదు. పుస్తకాలును కాపాడేందుకు పెట్టిన వస్త్రాలు కాలినా, కాపీలు మాత్రం దగ్ధం కాలేదు. బ్యాంక్​లో చాలా ఎలుకలు ఉన్నాయి. కానీ ఏరోజు రామనామాల పుస్తకాలకు హానీ చేయలేదు. ఇది మరో అద్భుతం."
--రామ్​ సింగ్​, బ్యాంక్​ మేనేజర్​

జనవరి 14 నుంచి 22 వరకు అజ్​మేర్​లోని అజాద్​ పార్క్​లో శ్రీరామ్​ నామ్ దాన్ సంగ్రహ్ బ్యాంక్​లోని రామనామ పుస్తకాలను ప్రదర్శనకు ఉంచనున్నారు. సుమారు 100 ప్రదేశాల్లో ఈ ప్రదర్శన ఉంటుందని బ్యాంక్ మేనేజర్ రామ్ సింగ్ చెప్పారు. ప్రతి ఏడాది డిసెంబర్​ మొదటి వారంలో జైపుర్​లోని గోవింద్ దేవ్ ఆలయంలో ప్రదర్శనకు ఉంచుతామని తెలిపారు. ఈ నెలలో 10వేల కోట్ల రామనామాలతో పుష్కర్​లో భారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఇది భవిష్యత్తులో పర్యటక కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సీతారాముల బ్యాంక్.. రామ నామాలు డిపాజిట్.. పుణ్యం మీ సొంతం!

ఒకటిన్నర టన్నుల బరువుతో అయోధ్య రాముడి విగ్రహం- ఆ శిల్పిదే ఫైనల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.