ETV Bharat / bharat

ఎన్నికల వేళ ఫారిన్​ టూర్.. భాజపాకు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన రాహుల్!

author img

By

Published : Dec 30, 2021, 5:08 PM IST

Rahul Gandhi foreign tour: కొత్త ఏడాదికి రెండు రోజుల ముందు విదేశీ పర్యటనకు వెళ్లారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న తరుణంలో ఆయన వేరే దేశానికి వెళ్లడం కాంగ్రెస్ ప్రచారంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భాజపా దీన్ని సద్వినియోగం చేసుకోనుంది. అయితే రాహుల్ పర్యటన వ్యక్తిగతమని, దీనిపై భాజపా దుష్ప్రచారం చేయొద్దని కాంగ్రెస్ హితవు పలికింది. త్వరలోనే ఆయన తిరిగి వస్తారని పేర్కొంది.

Rahul Gandhi abroad, రాహుల్ గాంధీ
భాజపాకు మళ్లీ ఛాన్సిచ్చిన రాహుల్.. ఎన్నికలకు ముందు విదేశీ పర్యటన

Rahul Gandhi foreign trip: 2022లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి రాజకీయ పార్టీలు. భారీ ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇలాంటి కీలక సమయంలో విదేశాలకు పయనమయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బుధవారం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు కూడా రాహుల్​ విదేశానికి వెళ్లారు. సరిగ్గా ఒక్క రోజు ముందు తిరిగివచ్చారు.

అయితే రాహుల్ విదేశీ పర్యటన వ్యక్తిగత విషయమని, త్వరలోనే తిరిగి వస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్​దీప్ సుర్జేవాలా తెలిపారు. భాజపా దీనిపై దుష్ప్రచారం చేయొద్దని సూచించారు. కానీ రాహుల్ ఎక్కడకు వెళ్లారు, ఎప్పుడు తిరిగి వస్తారు అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

Assembly elections 2022

ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​, ఉత్తరాఖండ్​, గోవా, మణిపుర్​లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంబాజ్​లో రాహుల్​ జనవరి 3న బహిరంగ సభకు రాహుల్ హాజరుకావాల్సి ఉంది. కానీ విదేశీ పర్యటన కారణంగా అది జనవరి 15కు వాయిదా పడింది. ప్రచారం ఆలస్యం కావడం వల్ల ఆ ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలపైనా పడే అవకాశం ఉంది.

రాహుల్ ప్రచారం ఆలస్యం చేయడం వల్ల భాజపాకు మరింత అవకాశం ఇచ్చినట్లయింది. జనవరి మొదటి వారంలోనే ఆ పార్టీ కూడా పంజాబ్​లో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే ప్రణాళికలు వేసింది. జనవరి 5న ప్రధాని నరేంద్ర మోదీతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. సాగు చట్టాలు ఉపసంహరించుకున్న తర్వాత మోదీ తొలిసారి పంజాబ్ పర్యటనకు వెళ్తున్నారు.

Punjab election news

పంజాబ్​లో కెప్టెన్​ అమరీందర్ సింగ్​ పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు కమలం పార్టీ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తోంది.

2017 పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని విజయం సాధించింది కాంగ్రెస్. ఆమ్​ ఆద్మీ పార్టీ 20 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్​ 15 సీట్లు గెలుచుకోగా... భాజపా 3 స్థానాలకే పరిమితమైంది.

Rahul Gandhi election campaign

రాహుల్ గాంధీ ఇటీవలే గోవా, ఉత్తరాఖండ్​లో పర్యటించి కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చాక జనవరి 15న పంజాబ్​లో, 16న గోవాలో పర్యటించనున్నారు.

ఇదీ చదవండి: 'కాంగ్రెస్​ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక అప్పుడే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.