ETV Bharat / bharat

నాన్నతో కలిసి విమానం ఎక్కి- మోదీకి థాంక్స్​ చెప్పి

author img

By

Published : Jul 24, 2021, 6:03 AM IST

modi, PM modi
మోదీ, ప్రధాని మోదీ

తన తండ్రితో కలిసి విమానం ఎక్కిన ఓ బిహార్ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీకి థాంక్యూ చెబుతూ ట్వీట్​ చేశాడు. ఆ ట్వీట్​కు రిప్లై ఇచ్చారు మోదీ.

వివిధ ప్రాంతాలను కలపడానికి, ప్రజలకు విమాన ప్రయాణం సులభతరం చేయడానికే ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఓ వ్యక్తి ట్విట్టర్​లో చేసిన పోస్ట్​కు ఈ విధంగా జవాబిచ్చారు మోదీ.

మీ వల్లే మోదీజీ...

బిహార్​ దర్భంగా విమానాశ్రయంలో ముకుంద్ ఝా అనే వ్యక్తి తన తండ్రితో విమానం ఎక్కాడు. మొదటిసారి విమానం ఎక్కినందుకుగాను ప్రధాని మోదీకి ధన్యావాదాలు తెలుపుతూ ట్విట్టర్​లో మోదీ ఫొటో పోస్ట్ చేశాడు.

  • Happy to know!

    We are working towards boosting connectivity and comfort as far as the aviation sector is concerned.

    As for Darbhanga airport, it is becoming an important contributor to Bihar’s progress. https://t.co/X63zeB1OBY

    — Narendra Modi (@narendramodi) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జీవితంలో మొదటిసారి నాన్నతో కలిసి విమానం ఎక్కా. దర్భంగాలో విమానాశ్రయం ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. 2014 ఎన్నికల సమయంలో విమానాశ్రయం కట్టిస్తామని భాజపా మాటిచ్చింది. ఆ మాటను నిలబెట్టుకుంది."

--ముకుంద్ ఝా, ట్వీట్.

దీనికి రిప్లై ఇచ్చిన మోదీ.. ప్రజలకు విమాన ప్రయాణాలు సులభతరం చేసేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

ఇదీ చదవండి:'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై కలిసి పోరాడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.