ETV Bharat / bharat

బలమైన ఆడిట్లతోనే పారదర్శక వ్యవస్థ: మోదీ

author img

By

Published : Nov 16, 2021, 11:04 AM IST

Updated : Nov 16, 2021, 12:44 PM IST

కాగ్ తొలిసారి నిర్వహించిన 'ఆడిట్ దివస్' కార్యక్రమంలో(audit diwas ) ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బలమైన పారదర్శక వ్యవస్థకు ఆడిట్లు కీలకమన్నారు. కాగ్ కాలక్రమేణా ఎంతో బలంగా తయారైందని, ప్రతి తరం దీన్ని గుర్తుచేసుకోవాలన్నారు(pm modi latest news).

PM Narendra Modi
కాగ్ కార్యాలయంలో సర్దార్ పటేల్​ విగ్రహాన్ని ఆవిష్కరించి మోదీ

దిల్లీలోని కాగ్ కార్యాలయంలో నిర్వహించిన తొలి 'ఆడిట్ దివస్'లో(audit diwas) ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తొలిసారి ఈ కార్యక్రమం ​ నిర్వహిస్తున్నందుకు కాగ్​కు అభినందనలు తెలిపారు(audit diwas 2021 ).

" కొన్ని సంస్థలు కాలక్రమేణా మరిత బలంగా తయారవుతాయి. పరిణితి చెందుతాయి. చాలా సంస్థలు దశాబ్దాల తర్వాత ఔచిత్వాన్ని కోల్పోతాయి. కానీ కాగ్ అలా కాదు. ఇది వారసత్వం. ప్రతి తరం కాగ్​ను గుర్తు చేసుకోవాలి. ఇది పెద్ద బాధ్యత. ఒకప్పుడు ఆడిట్​ అంటే అనుమానం, భయం ఉండేది. కాగ్​కు, ప్రభుత్వానికి పడదనే ఆలోచన మన వ్యవస్థలో సాధారణమైంది. కాగ్​ అన్నింటిలో తప్పులు వెతుకుతుందని ప్రభుత్వ అధికారులు అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఆడిట్ అనేది వ్యాల్యూ ఎడిషన్​లో ముఖ్యమైన భాగమైంది. ప్రభుత్వ పనిని అంచనా వేసేందుకు కాగ్ బయటి కోణంలో ఆలోచిస్తుంది. మీరు మాకు ఏది చెప్పినా వ్యవస్థాపరంగా మెరుగుపరుస్తాం. దాన్ని సహకారంగా భావిస్తాం. గతంలో బ్యాంకింగ్ వ్యవస్థలో సరైన పారదర్శకత లేని కారణంగా ఎన్నో అవకతవకలు జరిగాయి. "

--ప్రధాని మోదీ.

డేటాతో చరిత్ర

డేటా అంటే సమాచారమని, అది భవిష్యత్తులో చరిత్రను తెలియజేస్తుందని మోదీ అన్నారు(modi speech latest). బలమైన శాస్త్రీయ ఆడిట్​ల వల్ల పారదర్శకత మరింత పెరుగుతుందని చెప్పారు. పారదర్శకత వస్తే ఫలితాలు స్పష్టంగా కన్పిస్తాయన్నారు(modi news).

అంకుర సంస్థలకు భారత్​లో అనుకూల వాతావరణం ఉందని, అంకురాల్లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశం మనదని మోదీ పేర్కొన్నారు(modi news today). ఇప్పటికే 50 యూనికార్న్ సంస్థలున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోశాయని మోదీ అన్నారు.

అంతకుముందు కాగ్​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. పటేల్​కు నివాళిగా దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జకీర్‌ నాయక్‌ సంస్థపై మరో ఐదేళ్లు నిషేధం

Last Updated :Nov 16, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.